Best Web Hosting Provider In India 2024

సచివాలయం: తల్లికి అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న సామెత చందంగా చంద్రబాబు వాగ్దానాలు ఉన్నాయని, అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్లకు మంచి చేయనోడు.. రేపు అధికారం ఇస్తేనే మంచి చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మహానాడు వేదికపై పేదలపై కపట ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబు.. తన 40 ఏళ్ల రాజకీయజీవితంలో, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడని నిలదీశారు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేదవాడినైనా చంద్రబాబు కోటీశ్వరుడ్ని చేశాడా..? పేదవారి గురించి, వారి భవిష్యత్తు గురించి చంద్రబాబు కొత్తగా పలుకుతుంటే ప్రజలంతా నవ్వుకుంటున్నారన్నారు. సచివాలయంలో మంత్రి మేరుగు నాగార్జున విలేకరుల సమావేశం నిర్వహించారు.