Best Web Hosting Provider In India 2024

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12వతేదీన స్కూళ్లు పునఃప్రారంభమయ్యే రోజే ప్రతి విద్యార్ధికీ జగనన్న విద్యా కానుక కిట్లను అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జగనన్న విద్యా కానుకకు సంబంధించి ప్రతి వస్తువును నిర్దిష్ట సమయంలోగా స్కూళ్లకు తరలించేలా తేదీలను నిర్ణయించారు. జూన్ 7వతేదీ నాటికే విద్యా కానుక కిట్లు పూర్తి స్థాయిలో పాఠశాలలకు చేరుకునేలా చర్యలు చేపట్టింది.