వివేకా హత్య కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదు

Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: వివేకా కేసులో సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని, ఈ కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర‌ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. విచారణను పక్కదారి పట్టించేలా, దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎల్లోమీడియా చర్చలు పెట్టిందని దుయ్యబట్టారు. సీఎం వైయ‌స్ జగన్‌ను ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేస్తున్నారని, వ్యవస్థను కించపరిచేలా ఒక మూకలా తయారై దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మీడియా పరిధులు దాటి వ్యహరిస్తోందని విమర్శించారు.   జడ్జికి దురుద్దేశాలు ఆపాదిస్తూ.. అతనికి డబ్బు మూటలు అందాయంటూ ఆ వర్గం మూఠా వ్యాఖ్యలు చేసిందని అన్నారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఏబీఎన్‌, మహాటీవీ కథనాలు ప్రచురించిందని, స్వేచ్చగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసేలా చర్చలు చేపట్టిందని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి ఎల్లో మీడియా ప్రయత్నించిందని.. దర్యాప్తునకు సంబంధించిన అంశాలు వారికెలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరైన నేపథ్యంలో సజ్జల రామ‌కృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు.  
 

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *