UGC NET 2024 : యూజీసీ నెట్​ ఫైనల్​ ఆన్సర్​ కీ విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

Best Web Hosting Provider In India 2024


యూజీసీ నెట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట@కు హాజరైన అభ్యర్థులు యూజీసీ నెట్ అధికారిక వెబ@సైట్ ద్వారా ఫైనల్ ఆన్సర్ కీని ugcnet.nta.ac.in డౌన@లోడ్ చేసుకోవచ్చు.

యూజీసీ నెట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీని డౌన్​లోడ్​ చేసుకునేందుకు డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

యూజీసీ నెట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీని ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

  • ugcnet.nta.ac.in యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్​ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూజీసీ నెట్ 2024 ఫైనల్ ఆన్సర్ కీ లింక్​పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు ఫైనల్ ఆన్సర్ కీని చెక్ చేసుకునేందుకు కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది.
  • పేజీని డౌన్​లోడ్ చేసుకోండి. తదుపరి అవసరానికి దాని హార్డ్ కాపీని తీసి పెట్టుకోండి.

ప్రకటించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలను రూపొందిస్తారు. యూజీసీ – నెట్ జూన్ 2024 ఫలితాలు/ఎన్టీఏ స్కోర్ ప్రకటించిన తర్వాత ఆన్సర్ కీ(లు)కు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించరని గుర్తుపెట్టుకోవాలి.

నార్మలైజేషన్​ ప్రాసెస్​ ఇలా..

  1. మల్టీ షిఫ్ట్ పేపర్లకు వివిధ షిఫ్టులు/సెషన్లలో అభ్యర్థులు సాధించిన మార్కులను ఎన్టీఏ స్కోర్ (పర్సంటైల్)గా మారుస్తారు.
  2. ఎన్టీఏ స్కోర్​పై వివరణాత్మక ప్రక్రియ.. పర్సంటైల్ స్కోర్ ఆధారంగా నార్మలైజేషన్ ప్రాసెస్​ కింద ఎన్టీఏ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంది.
  3. ఒక సబ్జెక్టు పరీక్షను మల్టీ షిఫ్టుల్లో నిర్వహిస్తే.. అభ్యర్థి సాధించిన మార్కులకు అనుగుణంగా ఎన్టీఏ స్కోరును లెక్కిస్తారు. కేటాయింపును నిర్ణయించడం కోసం తదుపరి ప్రాసెసింగ్​ని అన్ని షిఫ్ట్ లు/సెషన్​లకు రా మార్కుల కోసం లెక్కించిన NTA స్కోర్ విలీనం చేస్తారు.
  4. మల్టీ షిఫ్ట్​లకు పర్సంటేజ్​లు భిన్నంగా/అసమానంగా ఉన్న సందర్భాల్లో, అభ్యర్థులందరికీ (అంటే అన్ని షిఫ్టులకు) ఆ కేటగిరీకి అర్హత కటాఫ్ అత్యల్పంగా ఉంటుంది.

యూజీసీ నెట్ పరీక్షని ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4, 2024 వరకు నిర్వహించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీని సెప్టెంబర్​లో విడుదల చేయగా, అభ్యంతరాలు తెలిపేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 14, 2024గా నిర్ణయించారు. ఇక తాజాగా ఫైనల్​ ఆన్సర్​ కీ బయటకు వచ్చింది.

ఐటీల్లో పీజీ కోర్సులు..

ఐఐటీ జామ్ 2025 రిజిస్ట్రేషన్ తేదీని ఢిల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పొడిగించింది. 2025 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో మాస్టర్స్ చేరాలనుకునే విద్యార్థులు ఐఐటీ ఢిల్లీ నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ కు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ ఐఐటీ జామ్ కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ jam2025.iitd.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఐఐటీ జామ్ కు దరఖాస్తు చేసుకునే గడువును 2024 అక్టోబర్ 18 వరకు పొడిగించారు. పరీక్ష తేదీలు/ పరీక్ష పేపర్లు/ కేటగిరీ/ జెండర్ మార్చుకోవడానికి చివరి తేదీ 2024 నవంబర్ 18. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link