Peddapally Murder: ప్రియుడిని హత్య చేసిన మాజీ భర్త, సోదరుడు… మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

Best Web Hosting Provider In India 2024


Peddapally Murder: పెద్దపల్లి జిల్లాలో గత వారం జరిగిన యువకుడి హత్య ఘటనలో అతని ప్రియురాలు కూడా ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లై ఇద్దరు బిడ్డల తల్లి ప్రియుడి కోసం కుటుంబాన్ని కాదనుకుని వెళ్లి పోవడం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది.తన భార్యను తనకు కాకుండా చేశాడనే అక్రోశంతో ఆమె భర్త, సోదరుడు కలిసి యువతి ప్రియుడిని హతమార్చారు. ఈ ఘటనతో మనస్తాపం చెందిన యువతి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. 

 గోదావరిఖని హనుమాన్‌నగర్‌కు చెందిన అంజలి అనే యువతి భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి  యైటింక్లయిన్‌ కాలనీకి చెందిన ప్రియుడితో కలిసి  కాపురం చేస్తోంది. అతనితోనే ఉంటానని తెగేసి చెప్పడంతో పోలీసులు కూడా చేసేదేమి లేక వారిని విడిచిపెట్టారు. 

ఈ వ్యవహారంలో ఇరుపక్షాలకు  పోలీసులు పలుమార్లు  కౌన్సెలింగ్‌ కూడా  నిర్వహించారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు చేసేదేమీ లేక యువతి కోరుకున్న యువకుడితో వెళ్లేందుకు అనుమతించారు. మూడు నెలలుగా అతనితోనే కలిసి ఉంటోంది. గత శుక్రవారం సద్దుల బతుకమ్మ రోజు చెల్లెలిని చూాడలని ఉందంటూ అంజలికి ఆమె   అన్న ఫోన్‌ చేశాడు. 

చిరునామా చెప్పేందుకు ప్రియుడిని సోదరుడి వద్దకు పంపింది. వారు ఉంటున్న ఇంటికి వచ్చిన  అంజలి సోదరుడు ఆమెను గదిలో బంధించి మాజీ భర్తతో కలిసి ప్రియుడు వినయ్‌కుమార్‌ను హత్య చేశారు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిపై  ప్రియుడి బంధువులు దాడికి పాల్పడటంతో ఆమెను సఖీ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి గుంటూరు వెళ్లిన అంజలి ఆమె చిన్నమ్మ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని గోదావరి ఖని తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

ఏం జరిగిందంటే…

గోదావరిఖనిలోని సింగరేణి హాస్పిటల్ లో స్వీపర్‌గా పనిచేసే సాయివినయ్ అదే ప్రాంతానికి చెందిన సాయిఅంజలిని ప్రేమించాడు. అంజలికి నాలుగేళ్ళ క్రితం వివాహం జరగగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త పిల్లలు ఉండగా అంజలి సాయివినయ్ ప్రేమలో పడి నాలుగు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.

సాయి వినయ్‌ని ప్రేమ పెళ్ళి చేసుకుని ఇద్దరు 8 ఇన్ క్లైయిన్ కాలనీలో కాపురం పెట్టారు. ప్రేమ పెళ్ళిని వ్యతిరేకిస్తూ ఆగ్రహంతో ఆ జంటపై అంజలి మొదటి భర్తతో పాటు అతని సోదరుడు కక్ష పెంచుకున్నారు. 8 ఇన్ క్లైయిన్ కాలనీలో ఉన్న ప్రేమ జంటపై గత శుక్రవారం కత్తులతో దాడి చేశారు.  ఈ ఘటనలో అంజలి తప్పించుకోగా సాయి వినయ్ ప్రాణాలు కోల్పోయాడు.

అంజలిపై వినయ్ బంధువులు దాడికి యత్నం

పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టాక సాయి వినయ్ ని ప్రేమ పెళ్ళి చేసుకుని అతని ప్రాణం పోవడానికి కారణం అంజలి అంటు వినయ్ కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఆమెపై దాడికి యత్నించారు. స్థానికుల సహకారంతో పోలీసులు ఆమెను ఓ రూమ్ లో దాచి పెట్టి, రహస్యంగా సెఫ్ జోన్ కు తరలించారు. పండుగ పూట యువకుడు సాయి వినయ్ హత్యతో ఉద్రిక్తతకు దారితీసింది.‌

పోలీసుల అదుపులో ఇద్దరు?

ప్రేమ పెళ్ళిని వ్యతిరేకిస్తూ కత్తులతో దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించారు. అంజలి మొదటి భర్తతో పాటు ఆమె సోదరుడు హత్యకు పాల్పడినట్లు గోదావరిఖని ఏసిపి రమేష్ తెలిపారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని చట్టపరంగా శిక్ష పడేలా సాంకేతిక పరమైన ఎవిడెన్స్ కోర్టుకు సమర్పిస్తామన్నారు. హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

టాపిక్

Crime NewsCrime TelanganaTelugu NewsLatest Telugu NewsBreaking Telugu NewsPeddapalli

Source / Credits

Best Web Hosting Provider In India 2024