Rape case : 5ఏళ్ల చిన్నారిపై 43ఏళ్ల వ్యక్తి అత్యాచారం- రక్తం కారడంతో..

Best Web Hosting Provider In India 2024


ఘజియాబాద్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 43ఏళ్ల వ్యక్తి, ఓ 5ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది.

ఇదీ జరిగింది..

ఘజియాబాద్​లోని ఇందిరాపురం పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన 43 ఏళ్ల వ్యక్తిని ఆదివారం రాత్రి వసుంధర సెక్టార్ 14లోని ఓ పార్కులో పోలీసులు కాల్చారు. ఈ ఘటనలో నిందితుడికి గాయమైంది.

నిందితుడు బాధితురాలి పొరుగింటివాడని, ఘటన తర్వాత అతను పరారయ్యాడని, ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో పార్కులో తలదాచుకున్నట్టు సమాచారం అందిదని పోలీసులు తెలిపారు.

ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో చిన్నారి తండ్రి ఇందిరాపురం పోలీసులను ఆశ్రయించి తన కుమార్తెపై జరిగిన అత్యాచారంపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఇందిరాపురం పోలీస్ స్టేషన్​లో ఎఫ్​ఐఆర్ నమోదు చేసి బుదౌన్ జిల్లాకు చెందిన నిందితుడి ఆచూకీ కోసం ఐదు బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. తన కుమార్తెపై అత్యాచారం చేశాడని, దీంతో ఆమె తీవ్ర రక్తస్రావానికి గురైందని బాలిక తండ్రి ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు. “అతన్ని పట్టుకోవడానికి నేను పరిగెత్తినప్పుడు, అతను తన ఇంటి నుండి పారిపోయి పారిపోయాడు,” అని వివరించాడు.

ఇందిరాపురం సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పార్కులో ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసు బృందం వసుంధర సెక్టార్ 14లోని కార్పొరేషన్ పార్కుకు చేరుకుంది. పోలీసు బృందం రావడాన్ని గమనించిన నిందితుడు తన వద్ద ఉన్న నాటు తుపాకీతో అధికారులపై కాల్పులు జరిపాడు. అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుడి కాలికి బుల్లెట్ గాయమైందని. చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దాని కన్నా ముందు అతడిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు.

బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఇందిరాపురం పోలీస్ స్టేషన్​లో పోలీసులు నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 65(2) (పన్నెండేళ్ల లోపు బాలిపై అత్యాచారం), సెక్షన్ 5 (పన్నెండేళ్ల లోపు బాలికపై లైంగిక దాడి), 6 (తీవ్రమైన లైంగిక దాడి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఆదివారం చిన్నారి తండ్రి పనిలో ఉన్నాడు. ఆమె తల్లి మార్కెట్​ కోసం బయటకు వెళ్లింది. ఆ సమయంలో నిందితుడు బాలికను ప్రలోభపెట్టి తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత తనకు జరిగిన విషయాన్ని బాలిక బయటపెట్టింది. ఈ క్రమంలో చిన్నారి శరీరంలో రక్తాన్ని గుర్తించారు. చివరికి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వైద్య పరీక్షల్లో చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిందని ఇందిరాపురం పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link