Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో అమ్మ ఒడి పథకం అమలుకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి, గ్రూప్-1, 2 పోస్టులకు కేబినెట్ ఆమోదం లభించింది. ప్రభుత్వ ఉద్యోగులు సీపీఎస్ బదులు.. జీపీఎస్ అమలుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఎంఓయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు.