Best Web Hosting Provider In India 2024

అమరావతి: ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం కొత్తగా జీపీఎస్ను తీసుకువచ్చింది. అలాగే, జిల్లా కేంద్రాల్లో పనిచేసేవారికి 12 శాతం నుంచి 16శాతం హెచ్ఆర్ఏను పెంచింది. ఇక, 12వ పీఆర్సీ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలపడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.