Tirumala Rains : తిరుమలలో భారీ వర్షాలు, రేపటి వరకు శ్రీవారి మెట్టు నడకమార్గం మూసివేత

Best Web Hosting Provider In India 2024

వాయుగుండం ప్రభావంతో తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని రేపటి(గురువారం) వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు బుధవారం ఉన్నతాధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

విపత్తుల నిర్వహణ ప్రణాళికపై అధికారులతో చర్చించి, పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు మాట్లాడుతూ భారీ వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా తగిన జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.

కొండచరియలపై ప్రత్యేక నిఘా

కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని, అందుకు ప్రత్యేక నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ ముందస్తుగా జనరేటర్లకు డీజిల్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి కార్యాకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు.

ఇక వైద్య శాఖ తగినన్ని అంబులెన్సు లను అందుబాటులో పెట్టుకుని సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలని ఈవో జె.శ్యామలరావు ఆదేశించారు. ఇంజినీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ఇప్పటికే పాపవినాశనం, శిలా తోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. వాతావరణ పరిస్థితుల అనుగుణంగా ఈ మార్గాల్లో రాకపోకలను టీటీడీ పునరుద్ధరించనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Ap RainsTirumalaTtdWeatherImdAndhra Pradesh News
Source / Credits

Best Web Hosting Provider In India 2024