Best Web Hosting Provider In India 2024
Bangalore Murders: బెంగుళూరులో జంట హత్యలు కలకలం రేపాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు హత్యకు గురి కాగా, హత్యలకు పాల్పడిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
కోణనకుంటె ఠాణా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యలు బెంగుళూరులో కలకలం రేపాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కోలు గొల్లబాబు(45), కోలు లక్ష్మీ పైతమ్మ(40) దంపతులు ఉపాధి కోసం బెంగుళూరులో ఉంటున్నారు. వీరి వద్ద శ్రీకాకుళం జిల్లాకు చెందిన గణేశ్కుమార్ (20) కొన్నేళ్లుగా నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
వీరంతా కోణనకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలోన నివాసం ఉంటున్నారు. ఇటీవల కోణనకుంటె సోమేశ్వర లేఅవుట్లో నిర్మాణంలో ఉన్న ఒక భవంతిలో ఇటీవల పనికి కుదిరారు. ఈ క్రమంలో గొల్లబాబు భార్య పైతమ్మతో గణేశ్ వివాహేతర సంబంధం గురించి తెలిసి ఆగ్రహానికి గురయ్యాడు. పథకం ప్రకారం బుధవారం అర్ధరాత్రి వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో వారిపై దాడి చేశాడు.
కట్టెతో ఇద్దరినీ కొట్టి చంపేశాడు. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తన మరదలికి ఫోన్ చేసి భార్యను హత్య చేసినట్టు చెప్పాడు. అనంతరం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుల బంధువుల ఫిర్యాదు ఈ మేరకు నమోదు చేసిన బెంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టాపిక్