Bigg Boss Telugu 8 Elimination: హౌస్ నుంచి ఈ వారం అతడే ఎలిమినేట్?

Best Web Hosting Provider In India 2024

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఏడో వారం ఎలిమినేషన్ జరగనుంది. ఈ వారం నామినేషన్లలో ఏకంగా తొమ్మిది మంది నిలిచారు. దీంతో ఓటింగ్ కూడా రసవత్తరంగా సాగింది. ఏడో వారంలో వీకెండ్ ఎపిసోడ్స్ రానున్నాయి. ఎలిమినేషన్ ప్రక్రియ ఉండనుంది. అయితే, ఈ వారం బిగ్‍బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కానున్నారో లీక్‍లు వచ్చేశాయి.

డేంజర్‌లో పృథ్వి! మణి ట్విస్ట్

ఈ ఏడో వారం బిగ్‍బాస్ హౌస్ నుంచి నటుడు పృథ్విరాజ్ ఎలిమినేట్ అయ్యారని రూమర్లు వచ్చాయి. ఓటింగ్‍లో చివరి స్థానంలో నిలువడంతో అతడు హౌస్ నుంచి బయటికి వచ్చేనున్నాడని లీకుల ద్వారా వెల్లడైంది. రేపటి ఆదివారం ఎపిసోడ్‍లో ఈ విషయంపై క్లారిటీ రానుంది. అయితే, బయటికి వెళతానని మణికంఠ అంటుండటంతో అతడు ఎలిమినేట్ అవుతాడనికూడా రూమర్లు ఉన్నాయి. ఒకవేళ మణి వెళితే ఓట్లు తక్కువగానే ఉన్నా..పృథ్వి సేవ్ అవుతారు.

ఈ వారం నామినేషన్లలో పృథ్విరాజ్, మణికంఠ, హరితేజ, నిఖిల్, యష్మి గౌడ, నబీల్, ప్రేరణ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ నిలిచారు. ఇందులో నబీల్, నిఖిల్‍కు ఎక్కువ ఓట్లు వచ్చి టాప్‍లో నిలిచారని తెలుస్తోంది. అయితే, ఓటింగ్‍లో టేస్టీతేజ, హరితేజ, పృథ్వి చివర్లో నిలిచారని తెలుస్తోంది. అయితే, చివరికి డేంజర్ జోన్‍లో హరితేజ, పృథ్వి వెళ్లారట. ఈ ఇద్దరిలో ఆఖరికి తక్కువ ఓటింగ్ వచ్చిన పృథ్వి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. రూమర్లు ప్రకారం ఇదే జరుగుతుందా.. ఏదైనా ట్విస్ట్ ఉంటుందా అనేది చూడాలి. మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అవుతే.. పృథ్వికి కలిసి వస్తుంది. అతడు కొనసాగే ఛాన్స్ ఉంటుంది.

దూకుడుతో గొడవలు

పృథ్వి ఆరంభం నుంచి బిగ్‍బాస్ హౌస్‍లో దూకుడుగానే ఉన్నారు. టాస్కుల్లోనూ, వాదనల్లోనూ అగ్రెసివ్‍గా కనిపించారు. చాలాసార్లు నోరు జారారు. టాస్కుల్లో చాలాసార్లు బలప్రదర్శన చేశారు. గతంలో ఆదిత్య ఓంపై దురుసుగా ప్రవర్తించడం వల్ల పెద్ద గొడవే జరిగింది. ఆ తర్వాత నబీల్ సహా మరికొందరితో కూడా కొందరితో పృథ్వి గొడవలు పడ్డారు. ఇక సోనియా ఉన్నప్పుడు నిఖిల్‍తో కలిసి పృథ్వి గ్రూప్ గేమ్‍లా ఆడాడానే విమర్శలు ఉన్నాయి.

ఈ వారం అవినాశ్‍తో గొడవ

ఈ వారంలో అవినాశ్‍తో పృథ్వికి పెద్ద గొడవే జరిగింది. నామినేషన్ల సమయంలో అవినాశ్‍ను ‘రా.. వాడు’ అంటూ గౌరవం లేకుండా పృథ్వి మాట్లాడారు. గట్టిగట్టిగా అరిచారు. ఇది పృథ్వికి బాగానే మైనస్ అయింది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన అవినాశ్‍కు మంచి ఫేమ్ ఉంది. అందులోనూ బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అవినాశ్‍తో గొడవ పృథ్వి ఓటింగ్‍పై కచ్చితంగా ప్రభావం చూపే ఉంటుంది. మణికంఠతోనూ ఈ వారంలో మరోసారి పృథ్వికి మాటల యుద్ధం జరిగింది. విష్ణుప్రియతో పృథ్వి ట్రాక్ కూడా నడుస్తున్నట్టు అనిపిస్తోంది.

మొత్తంగా బిగ్‍బాస్ నుంచి ఏడో వారం పృథ్వి, మణికంఠల్లో ఒకరి ఎలిమినేట్ కానున్నారని లీకుల ద్వారా సమాచారం బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ విషయం చక్కర్లు కొడుతోంది. మరి, ఏం జరుగుతుందో చూడాలి.

రీఎంట్రీ కంటెస్టెంట్‍పైనా రూమర్లు

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఎలిమినేట్ అయిన ఓ కంటెస్టెంట్ రీఎంట్రీ ఇస్తారంటూ కొంతకాలంగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఆ కంటెస్టెంట్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. సోనియా మళ్లీ ఎంట్రీ ఇస్తారనే పుకార్లు గట్టిగా నడిచాయి. అయితే, ఇప్పుడు ఆదిత్య ఓం పేరు వినిపిస్తోంది. ఆదిత్య ఓం హౌస్‍లోకి రీఎంట్రీ ఇస్తారని రూమర్లు వస్తున్నాయి. ఈ రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందో, ఎవరొస్తారో చూడాలి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024