Bigg Boss 8 Telugu Manikanta: ఓపిక లేదు.. ఓటేయవద్దు.. ఇక చాలు: మణికంఠ.. అందుకే షాకింగ్ ఎలిమినేషన్! పృథ్వి సేఫ్?

Best Web Hosting Provider In India 2024

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ ఏడో వారం ఎలిమినేషన్‍లో అనుకోని మలుపు ఉండనున్నట్టు తెలుస్తోంది. ఓటింగ్ ప్రకారం పృథ్విరాజ్ తక్కువ ఓట్లతో ఉండగా.. అతడు ఎలిమినేట్ అవుతాడని రూమర్లు బలంగా వచ్చాయి. అయితే, నాగ మణికంఠ సడెన్ షాక్ ఇచ్చాడని తెలుస్తోంది. హౌస్ నుంచి బయటికి వెళ్లిపోవాలనుందని మణికంఠ స్వయంగా చెప్పారు. నేటి (అక్టోబర్ 19) శనివారం ఎపిసోడ్‍లో మణి ఈ కామెంట్లు చేశారు. తనకు ఓటు వేయవద్దని ప్రేక్షకులను కోరారు. బయటికి వెళ్లిపోతానని హోస్ట్ నాగార్జునతోనూ చెప్పారు.

ఓటు వేయొద్దు.. ఓపిక అయిపోయింది

వీకెండ్ ఎపిసోడ్ కావటంతో హోస్ట్ నాగార్జున డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హౌస్‍లో ఆటను చూపించారు. మణికంఠ ముందుగా హరితేజతో మాట్లాడారు. చీఫ్ కంటెండర్ కోసం జరిగిన బోన్ గేమ్ గురించి ముచ్చటించుకున్నారు. రెండు నిమిషాలు ఆడినందుకు తన వేలు వాచిందని హరితో మణి చెప్పారు. ఒక్క వారం ఆగితే ఫ్యామిలీ వస్తుందని గంగవ్వ చెప్పారు. ఏదో ఒకటి చేసి నాలుగో రౌండ్ వరకు వెళ్లాలని పోరాడానని మణి అన్నారు. ఆ తర్వాత విష్ణు కూడా ఈ విషయంపై మాట్లాడారు.

ఆ తర్వాత సోఫాలో నీరసంగా పడుకొని ఒంటరిగా బిగ్‍బాస్‍కు తన మొరచెప్పుకున్నారు మణికంఠ. హౌస్‍లో తాను ఉన్నది చాలని, తనకు ఓట్ చేయవద్దని ప్రేక్షకులకు దండం పెడుతూ అడిగారు మణికంఠ. “ఈ కొట్లాటలు భరించలేకనే నా గుండెల్లో నొప్పి వస్తోంది. నన్ను పీకేయండి. ప్లీజ్ నాకు ఓట్ చేయవద్దండి. నాకు ఒంట్లో ఓపిక అయిపోయింది” అని మణి అన్నారు.

ఇక చాలు

తాను ఇప్పటి వరకు హౌస్‍లో ఆడింది చాలని, బయటికి వెళ్లిపోవాలని అనుకుంటున్నాననేలా మణికంఠ మాట్లాడారు. “నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత వరకు నేను వచ్చా. చాలా నేర్చుకున్నా. ప్రేక్షకులు, ఆడియన్స్, నాగ్ సర్ చాలా నేర్పించారు. నేర్చుకుంది చాలు. నేర్చుకునే ఓపిక ఇక లేదు. ఇక నేను పొరపాట్లు చేయలేను. నేర్చుకున్న దాన్ని అమలు చేస్తూ లైఫ్‍ను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నా” అని బిగ్‍బాస్‍కు మణికంఠ తన గోడు చెప్పుకున్నారు.

తన కోడిబుర్రతో ఏం చేసినా స్ట్రాటజీ అనుకుంటున్నారని, రోజురోజుకు ఆట కష్టంగా ఉందని మణికంఠ అన్నారు. ఫ్యామిలీ వీక్ వరకు ఉందామనుకున్నా సాధ్యం కావడం లేదని తన కూతురికి చెప్పినట్టుగా మాట్లాడారు. ఇంటికి వచ్చేస్తా అంటూ చెప్పుకొచ్చారు. బయటికి వెళతానంటూ మణికంఠ ఏడ్చేశారు. హరితేజ బుజ్జగించారు.

నాగార్జునతోనూ..

కంటెస్టెంట్లకు హెడ్‍లైన్స్ ఇచ్చారు నాగార్జున. ఈ క్రమంలో మణితోనూ మాట్లాడారు. అయితే, తాను బిగ్‍బాస్ హౌస్‍లో ఉండలేకపోతున్నానని నాగార్జునతోనూ మణి చెప్పారు. తనకు శరీరం సహకరించడం లేదని చెప్పారు. దీంతో ఏం చేద్దామని నాగ్ అడిగారు. దీంతో తాను బయటికి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్టు మణి మరోసారి చెప్పారు.

మణి ఎలిమినేషన్ ట్విస్ట్!

ఓటింగ్ ప్రకారం మణికంఠకు ఈ వారం బాగానే ఓట్లు పడ్డాయి. తక్కువ ఓటింగ్ వచ్చిన పృథ్విరాజ్ ఎలిమినేట్ అవడం దాదాపు ఖాయమని సమాచారం బయటికి వచ్చింది. అయితే, తాను హౌస్‍లో నుంచి వెళ్లాలనుకుంటున్నట్టు మణి చెప్పడంతో ట్విస్ట్ వచ్చినట్టు తెలుస్తోంది. మణికంఠను ఎలిమినేట్ చేయాలని బిగ్‍బాస్ నిర్ణయించారని తెలుస్తోంది. ఓటింగ్ ప్రకారం కాకుండా.. వెళ్లిపోవాలని స్వయంగా అంటుండటంతో మణికంఠను ఎలిమినేట్ చేయాలనే నిర్ణయం జరిగిందని సమాచారం. దీంతో పృథ్వి సేవ్ అయ్యారని తెలుస్తోంది. ఎలిమినేషన్ తంతు రేపు ఆదివారం (అక్టోబర్ 20) ఎపిసోడ్‍లో ఉండనుంది. ఏం జరుగుతుందో చూడాలి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024