Rishab Shetty: హ‌నుమాన్ సీక్వెల్‌లో కాంతార హీరో – 50 కోట్ల రెమ్యున‌రేష‌న్‌!

Best Web Hosting Provider In India 2024

Rishab Shetty: తేజా స‌జ్జా హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ‌నుమాన్ మూవీ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ప్ర‌భాస్ క‌ల్కి త‌ర్వాత ఈ ఏడాది తెలుగులో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవ‌లం న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్‌తో ఫాంట‌సీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన హ‌నుమాన్ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 350 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

జై హ‌నుమాన్‌…

హానుమాన్‌కు సీక్వెల్‌ను ప్ర‌శాంత్ వ‌ర్మ అనౌన్స్‌చేసిన సంగ‌తి తెలిసిందే. జై హ‌నుమాన్ పేరుతో ఈ సీక్వెల్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జై హ‌నుమాన్‌లో హీరోగా చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్, య‌శ్‌తో పాటు ప‌లువురు ద‌క్షిణాది స్టార్స్ పేర్లు ప్ర‌చారం లోకి వ‌చ్చాయి.

మ‌రోవైపు సీక్వెల్‌పై చాలా రోజులుగా ఎలాంటి అప్‌డేట్ లేక‌పోవ‌డం…మోక్ష‌జ్ఞ‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ కొత్త మూవీని అనౌన్స్‌చేయ‌డంతో జై హ‌నుమాన్ ఆగిపోయిన‌ట్లు వార్త‌లొచ్చాయి.

కాంతార హీరో…

తాజాగా ఈ సీక్వెల్‌పై మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. జై హ‌నుమాన్ మూవీలో కాంతార ఫేమ్ రిష‌బ్‌శెట్టి హీరోగా న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌లే రిష‌బ్‌శెట్టిని క‌లిసిన ప్ర‌శాంత్ వ‌ర్మ క‌థ‌ను వినిపించిన‌ట్లు తెలిసింది. హీరో క్యారెక్ట‌ర్‌ను ప‌వ‌ర్‌ఫుల్‌గా డిజైన్ చేసిన తీరు న‌చ్చి ఈ సీక్వెల్‌లో న‌టించ‌డానికి రిష‌బ్‌శెట్టి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

జై హ‌నుమాన్ మూవీతోనే రిష‌బ్ శెట్టి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. జై హ‌నుమాన్‌తోపాటు సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో రిష‌బ్ శెట్టి మ‌రో సినిమా చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి.

మైత్రీ మూవీ మేక‌ర్స్‌…

జై హ‌నుమాన్ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సీక్వెల్ కోసం ప్ర‌శాంత్ వ‌ర్మ యాభై కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేసిన‌ట్లు స‌మాచారం. హ‌నుమాన్ స‌క్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని డైరెక్ట‌ర్ డిమాండ్ చేసినంత మొత్తాన్ని ఇవ్వ‌డానికి మైత్రీ ప్రొడ్యూస‌ర్లు అంగీక‌రించిన‌ట్లు చెబుతోన్నారు.

16 కోట్ల బ‌డ్జెట్‌…450 కోట్ల క‌లెక్ష‌న్స్‌…

రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించిన కాంతార మూవీ క‌న్న‌డ సినీ చ‌రిత్ర‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సెకండ్ మూవీగా నిలిచింది. కేవ‌లం 16 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన కాంతార 450 కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించింది. హీరోగా న‌టిస్తూనే కాంత‌ర మూవీకి రిష‌బ్ శెట్టి స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ప్ర‌స్తుతం కాంత‌ర‌కు ప్రీక్వెల్ చేయ‌బోతున్నాడు రిష‌బ్ శెట్టి. కాంత‌ర ఛాప్ట‌ర్ వ‌న్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

నాలుగు సినిమాలు…

హ‌నుమాన్ స‌క్సెస్‌తో డైరెక్ట‌ర్‌గా ప్ర‌శాంత్ వ‌ర్మ బిజీ అయ్యాడు. జై హ‌నుమాన్‌తో పాటు బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ డెబ్యూమూవీకి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. అధీరా, మ‌హాక‌ళి సినిమాల‌కు రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగానే ఈ సినిమాలు రాబోతున్నాయి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024