Guntur Woman Brain Dead : గుంటూరు జిల్లాలో దారుణం, రౌడీ షీటర్ తో కారులో వెళ్లిన యువతి- తెల్లారేసరికి బ్రెయిన్ డెడ్

Best Web Hosting Provider In India 2024

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నిన్న సాయంత్రం ఓ వ్యక్తి కారులో వెళ్లిన యువతి తెల్లారేసరికి బ్రెయిన్ డెడ్ గా ఆసుపత్రిలో ప్రత్యక్షం అయ్యింది. యువతిని నవీన్ అనే రౌడీ షీటర్ కారులో తీసుకెళ్లినట్లు స్థానికులు అంటున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కూతురును చూసి యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కూతురుని బతికించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆమెకు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు.

అసలేం జరిగింది?

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన అనే యువతి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అయితే కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన నవీన్ అనే రౌడీ షీటర్ శనివారం సాయంత్రం సహానను కారులో తీసుకెళ్లాడు. కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న సహానను తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చి జాయిన్ చేశాడు. అనంతరం సహాన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, ఆసుపత్రిలో చేర్చిన విషయం చెప్పాడు. ఏం జరిగిందని ప్రశ్నిస్తే… ఆ విషయం చెప్పకుండా అక్కడ్నుంచి పరారయ్యాడు.

తమ కుమార్తెకు ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందుతూ ఆమె తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికి సహాన అపస్మారకస్థితిలో ఉందని, పరీక్షిస్తే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు. విషయం తెలిసి సహాన తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు.

ఎలాగైన తమ బిడ్డను రక్షించాలని వైద్యులను వేడుకోగా…తామేమీ చేయలేమని వైద్యులు తేల్చేశారు. దీంతో ఆమెను బతికించుకునేందుకు గుంటూరు, మంగళగిరిలోని పలు ఆసుపత్రులకు సహానను తీసుకెళ్లారు. తామేం చేయలేమని వైద్యులు చేతులెత్తేయడంతో… చేసేదేంలేక తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో తమ బిడ్డ పరిస్థితికి కారణమైన రౌడీ షీటర్ నవీన్ ను కఠినంగా శిక్షించాలని సహాన తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

నిందితుడిపై రౌడీ షీట్

ఈ ఘటనపై బాధితురాలు సహాన తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రౌడీ షీటర్ నవీన్ యువతిని కారులో ఎక్కడికి తీసుకెళ్లాడు, ఏం జరిగింది. యువతికి బ్రెయిన్ డెడ్ ఎందుకు అయ్యిందనే పలు కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు నవీన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు నవీన్ పై వల్లభాపురం పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తెలిసింది. అతడిపై ఉన్న కేసులు, ఇతర వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు సహాన, రౌడీ షీటర్ కు ఉన్న సంబంధం ఏంటి? అతడితో కారులో ఎందుకు వెళ్లిందనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారు.

కడపలో దారుణం

ఇటీవల కాలంలో ఏపీలో మహిళలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. శనివారం కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి చికిత్స పొందుతూ మరణించింది. యువతిని నిందితుడు చాలా రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడికి ఇటీవల వివాహం అయినా… యువతిని వేధించేవాడని, చివరకి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

GunturCrime ApTelugu NewsAndhra Pradesh NewsTrending Ap
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024