Bigg Boss 8 Telugu: ఎవరికి చూపించినా వీడు మారడు: మణికంఠపై నాగార్జున కామెంట్.. ‘మీ ఇద్దరిదీ ఓవర్ యాక్షనే’: వీడియో

Best Web Hosting Provider In India 2024

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఏడో వారం కూడా ముగింపునకు వచ్చేసింది. శనివారం ఎపిసోడ్‍లో హోస్ట్ కింగ్ నాగార్జున కొందరు కంటెస్టెంట్లకు క్లాస్ తీసుకున్నారు. నేడు (అక్టోబర్ 20) ఆదివారం ఎపిసోడ్ కావడంతో హౌస్‍మేట్లతో ఆటలు ఆడించనున్నారు. ఫన్ గేమ్‍లతో పాటు ఈ వారం ఎలిమినేషన్‍పై కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ ఆదివారం ఎపిసోడ్‍కు సంబంధించిన రెండో ప్రోమో కూడా వచ్చింది. అదెలా ఉందంటే..

కంటెస్టెంట్లకు డైలాగ్స్ డెడికేషన్

హౌస్‍లో కొన్ని డైలాగ్స్ ఉన్న బోర్డులను బిగ్‍బాస్ ఇచ్చారు. ఏ డైలాగ్ ఎవరి సూటవుతుందో వారికి డెడికేట్ చేయాలని కంటెస్టెంట్లకు హోస్ట్ నాగార్జున చెప్పారు. నిఖిల్‍కు ముందుగా ఛాన్స్ వచ్చినట్టు ప్రోమోలో ఉంది.

చేతికి అందిన డైలాగ్ తీసి ఈ హౌస్‍లో ఎవరికి.. ఎందుకు డెడికేట్ చేస్తావో చెప్పు అని నిఖిల్‍కు నాగార్జున చెప్పారు. “నువ్వు ఊరుకో అమ్మా.. అన్నింటికి తుతుతూ అంటావ్” అనే డైలాగ్‍ను ప్రేరణకు నిఖిల్ కేటాయించారు. ఆమె మెడలో బోర్డ్ వేశారు. స్టూడియోలో ఆడియన్స్ కూడా చప్పట్లు కొడుతున్నారని, చాలా కరెక్ట్ అని ఫీలవుతున్నారని నాగ్ అన్నారు.

మణికి హరితేజ.. మారడంటూ నాగ్ కామెంట్

“వాడిని అలా వదిలేయకండ్రా.. ఎవరికైనా చూపించండ్రా” అనే డైలాగ్ హరితేజ చేతికి వచ్చేసింది. దీంతో ఈ డైలాగ్‍ను మణికంఠకు హరితేజ డెడికేట్ చేసి అతడి మెడలో బోర్డ్ వేసేశారు. అందరూ అప్పుడే చప్పట్లు కొట్టేస్తున్నారని నాగ్ అన్నారు.

“ఎవరికి చూపించినా వీడు మారడమ్మా.. అలాగే ఉంటాడు” అని మణికంఠ గురించి నాగార్జున అన్నారు. తాను హౌస్‍లో నుంచి వెళ్లిపోతానని శనివారం ఎపిసోడ్‍లో మణి మళ్లీ ఎమోషనల్ అవటంతో దాన్ని గుర్తు చేసేలా నాగ్ ఈ కామెంట్ చేశారు.

గంగవ్వ తర్వాత అవినాశే పెద్ద

“అదంతా అప్పుడండి.. ఇప్పుడు నేను మారిపోయా” అనే డైలాగ్‍ను అవినాశ్‍కు టేస్టీ తేజ ఇచ్చారు. అప్పట్లో కుర్ర వయసులో దూకుడు అంటూ తేజ జోక్ చేశారు. దీంతో కుర్ర వయసు ఏంటి అంటూ అవినాశ్ నవ్వుతూ అరిచారు. “వీడు నన్ను హౌస్‍లోకి వచ్చినప్పటి నుంచి పెద్దాయన.. పెద్దాయన అని అంటున్నాడు” అని తేజ గురించి నాగార్జునకు అవినాశ్ చెప్పారు. గంగవ్వ తర్వాత హౌస్‍లో అవినాశే పెద్ద అని తేజ అన్నారు. అందుకే కదా రెస్పెక్ట్ ఇవ్వాలని నాగ్ అనడంతో అవినాశ్ నవ్వుతూ దండం పెట్టేశారు.

ఓవరాక్షన్ అంటూ ఇద్దరికీ పంచ్

“సరెసర్లే ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ అవుతాయా ఏంటీ” అనే డైలాగ్‍ను విష్ణుప్రియకు రోహిణి ఇచ్చారు. ఇది గుర్తు పెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం అనే డైలాగ్‍ను గౌతమ్‍కు నబీల్ డెడికేట్ చేశారు.

“ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంట్రా.. ఓవర్ యాక్షన్” అనే డైలాగ్‍ను పృథ్వికి అవినాశ్ ఇచ్చారు. తాను ఇది అవినాశ్‍కే ఇవ్వాలని అనుకున్నట్టు పృథ్వి చెప్పారు. నామినేషన్ల సమయంలో ఒకేయ్ అన్నందుకు అవినాశ్ ఫైర్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ విషయంలో ఇద్దరిదీ ఓవర్ యాక్షనే అంటూ పృథ్వి, అవినాశ్‍కు కలిపి పంచ్ వేశారు నాగార్జున. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ డైలాగ్ బోర్డ్ పట్టుకున్నారు. దీంతో ఇది కూడా ఓవర్ యాక్షనే అంటూ నాగ్ మరోసారి అన్నారు. దీంతో ఈ ప్రోమో ముగిసింది.

ఓ కంటెస్టెంట్ బొమ్మ గిస్తే దాన్ని బట్టి మిగిలిన వారు సినిమా పేరు గుర్తించాలనే ఓ గేమ్‍ను నాగ్ ఆడించారు. ఇది నేటి ఎపిసోడ్ తొలి ప్రోమోలో సాగింది. తాను వెళ్లిపోతానని స్వయంగా మణికంఠ చెప్పడంతో.. ఈ వారం అతడే ఎలిమినేట్ అవుతాడనే రూమర్లు ఉన్నాయి. ఫన్ గేమ్స్ ఎలా సాగాయి.. ఎవరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారనే విషయం నేటి ఎపిసోడ్‍లో తేలనుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024