నా కుమారుడి అరెస్ట్‌ అక్రమం

Best Web Hosting Provider In India 2024

మాజీ మంత్రి విశ్వరూప్‌

టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌

హ‌త్య కేసులో నా కుమారుడి ప్ర‌మేయం లేదు 

తాడేపల్లి:  రాజకీయ కక్షతో తన కుమారుడిని హత్య కేసులో ఇరికించారని, త‌న కుమారుడి అరెస్టు అక్ర‌మ‌మ‌ని మాజీ మంత్రి పినేపి విశ్వరూప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని మండిప‌డ్డారు. కోనసీమలో కక్ష రాజకీయాలకు కూటమి సర్కార్‌ ఆజ్యం పోస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న కుమారుడి అక్ర‌మ అరెస్టును విశ్వ‌రూప్ తీవ్రంగా ఖండించారు.

మాజీ మంత్రి విశ్వరూప్‌ సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ.. కావాలనే నా కుమారుడిని హత్య కేసులో ఇరికించారు. హత్య కేసుతో నా కుమారుడికి ఎలాంటి సంబంధం లేదు. చనిపోయిన వ్యక్తి మా పార్టీ కార్యకర్తే. ఎఫ్‌ఐఆర్‌లో నా కొడుకు పేరు ఎక్కడా లేదు. అక్రమంగా నా కుమారుడిని అరెస్ట్‌ చేశారు. రాజకీయ కక్షతో నిందితులతో నా కొడుకు పేరు చెప్పించి తప్పుడు కేసు పెట్టారు. టీడీపీ కూటమి ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోంది. కోనసీమలో కక్ష రాజకీయాలకు ఆజ్యం పోస్తోంది. మధురై ఆలయ సందర్శనకు వెళ్లి వస్తున్న సమయంలో నా కుమారుడిని అరెస్టు చేశారు అని చెప్పారు. న్యాయ‌స్థానాల‌పై మాకు అపార‌మైన న‌మ్మ‌కం ఉంద‌ని విశ్వ‌రూప్ అన్నారు. తాను ఒక డాక్ట‌ర్ అని, ప్రాణాలు కాపాడ‌మే కానీ, ప్రాణాలు తీయ‌డం త‌న‌కు తెలియ‌ద‌ని విశ్వ‌రూప్ కుమారుడు స్ప‌ష్టం చేశారు.

Best Web Hosting Provider In India 2024