Best Web Hosting Provider In India 2024
23 Oct 2024 10:33 AM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు గుంటూరు, వైయస్ఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జీజీహెచ్లో టీడీపీ కార్యకర్త, రౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శిస్తారు.
👉కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు గుంటూరు జీజీహెచ్కు వైఎస్ జగన్ చేరుకుంటారు.
👉అనంతరం.. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైయస్ఆర్ జిల్లా బద్వేలుకు చేరుకుంటారు. ప్రేమోన్మాది దాడిలో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించి మధ్యాహ్నం మూడు గంటలకు పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు.