కాసేపట్లో జీజీహెచ్‌కు వైయ‌స్‌ జగన్‌

Best Web Hosting Provider In India 2024

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేడు గుంటూరు, వైయ‌స్ఆర్  జిల్లాల్లో పర్య­టించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జీజీహెచ్‌లో టీడీపీ కార్య­కర్త, రౌడీషీటర్‌ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబస­భ్యులను పరామర్శిస్తారు.

👉కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయ­లు­దేరి 10.50 గంటలకు గుంటూరు జీజీ­హెచ్‌కు వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. 

👉అనంతరం.. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం వైయ‌స్ఆర్  జిల్లా బద్వేలుకు చేరుకుంటారు. ప్రేమోన్మాది దాడి­లో మృతి చెందిన దస్తగిరమ్మ కుటుంబాన్ని పరామర్శించి మధ్యాహ్నం మూడు గంటలకు పులివెందుల చేరుకుంటారు. రాత్రికి అక్కడే బసచేస్తారు. 

 

Best Web Hosting Provider In India 2024