Best Web Hosting Provider In India 2024
23 Oct 2024 6:26 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విజయనగరం జిల్లా గుర్లలో పర్యటించనున్నారు. డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, బాధితులను వైయస్ జగన్ పరామర్శించనున్నారు.
ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటల ప్రాంతంలో గుర్ల చేరుకుంటారు. అక్కడ డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.