Best Web Hosting Provider In India 2024
టీజీవో ఉద్యోగుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ప్రధానంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఉద్యోగుల సమస్యలపై ఆర్థిక మంత్రి భట్టి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ప్రభుత్వానికి సహకరించాలని ఉద్యోగులను కోరారు. శుక్రవారం(రేపు) సాయంత్రంలోపు డీఏలపై స్పష్టత ఇస్తామని తెలిపారు.
ఈ భేటీలో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న 5 డీఏలు, బిల్లులు, హెల్త్ కార్డులు, పీఆర్సీ, సీపీస్ రద్దు, 317 జీవోపై చర్చించాలి. ఆయా అంశాల్లో నెలకొన్న ఇబ్బందులను ఉద్యోగ సంఘాల నేతలు… ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై తక్షణమే సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
టాపిక్
Cm Revanth ReddyTelangana NewsEmployees
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.