Crime news : గర్భవతిని చేశాడు- పెళ్లి చేసుకోమంటే చంపేశాడు.. దిల్లీలో దారుణం!

Best Web Hosting Provider In India 2024


దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి, తన గర్ల్​ఫ్రెండ్​ని గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోమని ఆమె అడుగ్గా, కోపంతో ఆ యువతిని చంపేసి, మృతదేహాన్ని పాతిపెట్టాడు! మృతిచెందిన యువతి వయస్సు కేవలం 19!

ఇదీ జరిగింది..

పశ్చిమ దిల్లీలోని నంగ్లోయి అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివాసముండే సోని అనే 19ఏళ్ల యువతి సోషల్​ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటుంది. ఆమెకు 6వేలకుపైగా ఫాలోవర్స్​ ఉన్నారు. ఆమెకు సంజు అలియాస్​ సలీమ్​ అనే బాయ్​ఫ్రెండ్​ ఉన్నాడు. వారిద్దరికి సంబంధించిన ఫొటోలు వారి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్స్​లో చాలానే ఉన్నాయి.

అయితే సలీమ్​ సోనీని గర్భవతి చేశాడు. పెళ్లి చేసుకుందామని ఆమె పదేపదే అతడిని అడిగడం మొదలుపెట్టింది! కానీ సలీమ్​ ఎప్పుడూ సోనీని సీరియస్​గా తీసుకోలేదు. చివరికి, 7వ నెల వచ్చేసరికి పెళ్లి గురించి సోనీ మరింత మాట్లాడటం మొదలుపెట్టింది. కానీ తాను పెళ్లికి సిద్ధంగా లేనని, అబార్షన చేయించుకోవాలని అతను చెప్పేవాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేది. ఈ నేపథ్యంలోనే సలీమ్​, సోనీని చంపాలని నిర్ణయించుకున్నాడు.

గత సోమవారం.. సలీమ్​ని చూసేందుకు సోనీ వెళ్లింది. అప్పుడే అతను మరో ఇద్దరు సన్నిహితులను పిలిపించాడు. వారందరు కలిసి సోనీని హరియాణాలోని రోహ్​తక్​కి తీసుకెళ్లారు. అక్కడ, వారందరు సోనీని చంపేశారు. ఎవరికీ దొరకకుండా మృతదేహాన్ని పాతిపెట్టారు.

సోనీ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఇంట్లో వాళ్లకి ఆందోళన మొదలైంది. వారు పోలీసులను సంప్రదించారు. “ఎవరితోనే సోనీ ఎక్కువ మాట్లాడుతోందని మాకు తెలుసు. కానీ అతనెవరో తెలియదు,” అని చెప్పారు.

చివరికి.. దర్యాప్తు సలీమ్​ వరకు వెళ్లింది. ఫలితంగా అసలు విషయం బయటపడింది. పోలీసులు సలీమ్​ని అరెస్ట్​ చేశారు. మరో ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

బాయ్​ఫ్రెండ్​ని చంపిన మహిళ..

మరోవైపు ఓ మహిళ, తన బాయ్​ఫ్రెండ్​ని చంపిన ఘటన దిల్లీలోని ముకుంద్​పూర్​లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం మహిళ అతడి తలపై గ్రైండింగ్ స్టోన్​తో కొట్టింది, ఆపై సుత్తితో కొట్టి, చివరకు కత్తితో పొడిచి చంపేసింది.

మృతుడిని మహ్మద్ తవారాక్ (30)గా గుర్తించారు. అతన్ని చంపిన తర్వాత నిందితురాలు మున్నీ యాదవ్ సమీపంలోని భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్​కు వెళ్లి హత్య చేసినట్లు అంగీకరించింది. అయితే తవారాక్ తరచూ తనపై దాడి చేయడంతో ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని పోలీసులు తెలిపారు.

యాదవ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

2022లో ముకుంద్​పూర్​ పార్ట్ 2లోని ఓ ఫ్లాట్​లో యాదవ్, తవారక్ కలిసి నివసించడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు. వీరిద్దరికి గతంలోనే వేరువేరు పెళ్లిళ్లు జరిగాయి. యాదవ్​కు నలుగురు, తవారాక్, ఒక బిడ్డ ఉన్నారు.

వారిమధ్య మనస్పర్థలు ఉండేవని, చిన్నచిన్న విషయాలకు తరచూ గొడవపడేవారని ఇరుగుపొరుగు వారు తమకు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు.

తవారాక్ తరచూ మద్యం సేవించి తనను, తన పిల్లలను కొట్టేవాడని యాదవ్ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఔటర్) నితిన్ వల్సన్ తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link