సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊర‌ట 

Best Web Hosting Provider In India 2024

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి కి ఏపీ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఆయ‌న దాఖ‌లు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను మంగళవారం ఏపీ హైకోర్టు విచారించింది. సజ్జల కేసు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు మరో రెండు వారాలపాటు పొడిగించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ నేతలకు వేధింపులు ఎక్కువయ్యాయని సజ్జల తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తనపై 41ఏ నోటీసుకు వీలులేని సెక్షన్లు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని సజ్జల ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Best Web Hosting Provider In India 2024