
ఎన్టీఆర్ జిల్లా / చందర్లపాడు :
90% శాతం మంది ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు ..
చందర్లపాడు గ్రామంలో “గడపగడపకు- మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
రోజుకు సుమారు 300 గడపలు తిరుగుతూ ప్రజలతో మాట్లాడి ప్రభుత్వ పనితీరును వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ..
ప్రతి గడప వద్దకు వెళ్లి ఆయా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబం ఎంత లబ్ధి పొందిందో వివరిస్తూ – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ పనితీరును వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
తమ ఇళ్లకు వస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారికి అపూర్వ స్వాగతాలు పలుకుతూ – ఆయనతో మమేకమవుతున్న ప్రజలు ..
ప్రజల ఇళ్ళ ముందుకే ప్రభుత్వ పరిపాలన తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ది ..
ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన 90% హామీలను అమలు చేసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, జడ్పిటిసి , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ,సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..