Double murder : యూపీలో డబుల్​ మర్డర్​ కలకలం- తల్లీకూతుళ్ల గొంతులు కోసి..

Best Web Hosting Provider In India 2024


Double murder : యూపీలో డబుల్​ మర్డర్​ కలకలం- తల్లీకూతుళ్ల గొంతులు కోసి..

Sharath Chitturi HT Telugu
Feb 01, 2025 09:00 AM IST

UP Double murder : యూపీలోని ఓ ఇంట్లో ఓ తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు! ఎవరో, వారి గొంతులు కోసి చంపి పారిపోయారు. ఈ నేరానికి పాల్పడిన వారు ఇంకా పోలీసులకు చిక్కలేదు.

యూపీలో డబుల్​ మర్డర్​ కలకలం..
యూపీలో డబుల్​ మర్డర్​ కలకలం..

ఉత్తర్​ప్రదేశ్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో ఓ తల్లీకూతుళ్లు శవమైన కనిపించారు. వారి గొంతులు కోసేసి ఉన్నాయి. నిందితులు ఇంకా పోలీసులకు చిక్కకపోవడం ఆందోళనకర విషయం! ఈ హత్యకు పాల్పడింది ఒకరేనా? లేక ఇందులో ఎంత మంది హస్తం ఉంది? అన్నది ప్రస్తుతం ఎవరికీ తెలియదు.

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

ఉత్తర్​ప్రదేశ్​లోని మలహాబాద్​ పట్టణం సమీపంలో ఉన్న ఇషాపూర్​ అనే గ్రామంలో గురువారం మధ్యహ్నం ఈ డబుల్​ మర్డర్​ వ్యవహారం బయటపడింది. గీత, ఆమె కూతురు దీపికలు ఆ ఇంట్లో నివాసముంటున్నారు. ఆమె భర్త ప్రకాశ్​, ఉద్యోగం పని మీద కొంతకాలం క్రితం ముంబై వెళ్లాడు. గీత కుమారుడు దేవాన్ష్​, తన తాత సిద్ధాంత్​ ఇంటికి వెళ్లాడు.

కాగా తల్లితో మాట్లాడాలని బుధవారం రాత్రి గీతకు దేవాన్ష్​ ఫోన్​ చేశాడు. కానీ ఎవరూ ఫోన్​ లిఫ్ట్​ చేయలేదు. పదేపదే కాల్​ చేసినా లాభం లేకుండా పోయింది. ఇదే విషయాన్ని దేవాన్ష్​ తన తాతకు చెప్పాడు. ఆందోళనకు గురైన ఆ ఇద్దరు.. మరుసటి రోజు, అంటే గురువారం ఉదయం మలహాబాద్​కు బయలుదేరారు.

గురువారం మధ్యహ్నం ఇంటికి చేరుకున్న ఆ ఇద్దరు డోర్​ కొట్టారు. చాలా సేపటి వరకు ఎవరు తలుపు తీయలేదు. ఈ నేపథ్యంలోనే మహిళ తండ్రి సిద్ధాంత్​, నిచ్చెన సాయంతో ఇంట్లోకి ప్రవేశించాడు. దేవాన్ష్​ కూడా లోపలికి వెళ్లాడు.

ఓ గదిలో విఘతజీవులుగా పడి ఉన్న గీత, దీపికలు వారికి కనిపించారు. వారు గొంతులు కోసేసి ఉండటాన్ని చూసి షాక్​కు గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తలుపు తెరిచి, వెంటనే స్థానికులను పిలిచారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేసుకున్న అధికారులు, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

అసలు ఈ పని ఎవరు చేశారు? తల్లీకూతుళ్లును చంపింది ఒకరేనా? లేక ఎంత మంది కలిసి చంపారు? వంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పోలీసుల వద్ద కూడా సమాధానం లేదు.

“మహిళ, ఆమె కూతురుని పదునైన ఆయుధం వాడి చంపేశారు. ఫోరెన్సీక్​ నిపుణుల టీమ్​ ఘటనాస్థలాన్ని పర్యవేక్షించింది. కీలక ఆధారాలను సేకరించింది. డాగ్​ స్క్వాడ్​ని కూడా ఉపయోగిస్తున్నాము. ఎవరైనా ఈ నేరానికి పాల్పడ్డారో, వారిని కచ్చితంగా పట్టుకుంటాము,” అని సీనియర్​ పోలీసు అధికారి తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తల్లీకూతుళ్లు ఉదయం వరకు తలుపు తెరవకపోవడంతో తమకు అనుమానం వచ్చిందని, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని స్థానికులు చెబుతున్నారు. నిందితులు ఎవరో వెంటనే పట్టుకుని, వారిని అరెస్ట్​ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నారు.

తన తల్లి, సోదరిని కోల్పోయిన దేవాన్ష్​ చాలా బాధలో ఉన్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link