పచ్చదొంగల ముఠా ఊళ్ల మీద పడుతోంది..జాగ్రత్త

Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: పచ్చదొంగల ముఠా ఊళ్ల మీద పడుతోంది..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. అంతర్జాతీయ దొంగల ముఠాలకి ఏమాత్రం తీసిపోని పార్టీ టీడీపీ అని మండిప‌డ్డారు. మోసం చేయడంలో కొత్త టెక్నిక్కులతో ఏం చేస్తున్నారో ఈ మధ్యే బయట పడింది అని అన్నారు. పచ్చ దొంగల ముఠా పట్టపగలు ఇళ్ళమీద పడుతోంది అప్రమత్తంగా ఉండాలి.. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ 20 జూన్ 2024 నుంచీ మీ అకౌంట్ లో జమ చేయడం ప్రారంభం అంటూ ఓ కార్డు ఇచ్చారు.. అమలు అనేది అధికారంలోకి వచ్చాక ఉంటుంద‌న్నారు. 2014లో   ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా టీడీపీ అడ్డగోలు హామీలు ఇస్తుంది.. ఇలాంటి చర్యలను ఏ విధంగా శిక్షించాలో ప్ర‌జ‌లే ఆలోచ‌న చేయాల‌న్నారు.  చంద్రబాబు 5 కోట్ల మందిని ప్రలోభపెట్టి మోసం చేస్తున్నాడు ,  ఏ చట్టం కింద ఇదంతా చేయొచ్చో చంద్రబాబు చెప్పాల‌ని డిమాండు చేశారు. 2019లో వైయ‌స్ఆర్‌ సీపీ ఓట్లు తీయించి మానిప్యులేట్ చేసాడు.. ప్రత్యర్ధి పార్టీ ఓట్లు తప్పించి గెలుపు తెచ్చుకోవాలని 2019లో ప్రయత్నించాడు.. సేవామిత్ర యాప్ ద్వారా కూడా ఓట్ల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారు అని గుర్తు చేశారు. పొలిటికల్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఓటర్, ఓటరు కులం తెలుసుకుంటున్నారు.. 2017లో 50లక్షల వైయ‌స్ఆర్‌ సీపీ ఓట్లు తీసేసాడు ..ప్రతి పక్షంలోకి వచ్చాక ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు.. రాష్ట్ర స్ధాయిలో అన్యాయమైన విధానాలు ఫాలో అవుతున్నారు.. చంద్రబాబు చేస్తున్న పనులపై సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ కు కంప్లైంట్ చేస్తామని చెప్పారు.  బందిపోటు దొంగ, మోసగాడు చంద్రబాబు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.  మంగ‌ళ‌వారం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *