Best Web Hosting Provider In India 2024

వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి
వైయస్ఆర్ జిల్లా : చంద్రబాబు, కరువు అవిభక్త కవలలని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి ఎద్దేవా చేశారు. వారి మధ్య విడదీయలేని బంధం ఉందని అన్నారు. శుక్రవారం రవీంద్రనాథ్రెడ్డి కడపలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అంటే కరువు … కరువు అంటే చంద్రబాబు అనేది జగమెరిగిన సత్యమన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సకాలంలో వర్షాలు కురువవు, పంటలు పండవన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని ఊదరగొట్టిన కూటమి నేతలు ఇంతవరకు నయా పైసా కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నేరవేర్చలేదన్నారు. ఈ క్రాప్ విధానం, రైతు భరోసా కేంద్రాలను నాశనం చేసిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. కూటమి పాలనలో రైతులకు మద్దతు ధర లేదు, ఈ క్రాపింగ్ లేదు, ఆర్బికే లు లేవన్నారు. వైయస్ జగన్ తన పాలనలో రైతులకు అన్ని విధాల తోడుగా నిలిచారని గుర్తు చేశారు. నష్టాల్లో ఉన్న మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు ఇటీవల గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన వైయస్ జగన్పై తప్పుడు కేసు నమోదు చేయడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని, రైతుల సమస్యలపై వైయస్ఆర్సీపీ పోరాడుతుందని మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు.