Nadendla Manohar : కోడి కత్తికి ఎక్కువ, గొడలి పోటుకు తక్కువ-వైఎస్ జగన్ పై మంత్రి నాదెండ్ల ఫైర్

Best Web Hosting Provider In India 2024

Nadendla Manohar : కోడి కత్తికి ఎక్కువ, గొడలి పోటుకు తక్కువ-వైఎస్ జగన్ పై మంత్రి నాదెండ్ల ఫైర్

Bandaru Satyaprasad HT Telugu Mar 05, 2025 08:48 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Mar 05, 2025 08:48 PM IST

Nadendla Manohar : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఎస్ జగన్ చేసిన విమర్శలపై మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగన్ మతిస్థిమితంలేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము కూడా కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలి పోటుకు తక్కువ అని మాట్లాడగలమన్నారు.

కోడి కత్తికి ఎక్కువ, గొడలి పోటుకు తక్కువ-వైఎస్ జగన్ పై మంత్రి నాదెండ్ల ఫైర్
కోడి కత్తికి ఎక్కువ, గొడలి పోటుకు తక్కువ-వైఎస్ జగన్ పై మంత్రి నాదెండ్ల ఫైర్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Nadendla Manohar: కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి నాదెండ్ల మనోహర్ ఖండించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన వైఎస్ జగన్ పై మండిపడ్డారు.

“శాసనసభ నిబంధనలు తెలియకుండా వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయడం హాస్యాస్పదం. కనీసం ఇంగిత జ్ఞానంలేకుండా మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా, నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి జగన్ చేసి విమర్శలు మాకు చాలా బాధ కలిగించాయి. మన స్థానాన్ని నిర్ణయించేది ప్రజలు. వైనాట్ 175 అని ఎగిరినటువంటి వ్యక్తి జగన్.

ఇప్పుడు 11 స్థానాలకు పరిమితమైన మతిస్థితిమితం కోల్పోయారు. ఆ రోజు పవన్ కల్యాణ్ మాట్లాడిన విషయంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. రాజ్యాంగ బద్ధంగా తగిన సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదారాదని పవన్ కల్యాణ్ చెప్పారు. అయినప్పటికీ శాసనసభకు వచ్చి ప్రజాసమస్యలపై పోరాడాలని కోరారు. ఎవరో విలేకరి వైసీపీ 39 శాతం ఓట్ షేర్ వచ్చిందని అడిగితే…మన దేశంలో ఈ సంప్రదాయంలేదని, జర్మనీ లాంటి దేశాల్లో ఓట్ షేర్ ప్రకారం పాలనలో అవకాశం కల్పిస్తారని ఆ రోజు పవన్ కల్యాణ్ స్పందించారు”- మంత్రి నాదెండ్ల మనోహర్

“వైసీపీ తాడు, బొంగరంలేని పార్టీ. వైసీపీకి లైఫ్ టైమ్ ప్రెసిడెంట్ గా జగన్ తీర్మానం చేసుకున్నారు. ఎల్లప్పుడూ తానే అధ్యక్షుడు అని జగన్ ప్రకటించుకున్నారు. తన తల్లిని అధ్యక్ష పదవి నుంచి దింపేసి తాను వైసీపీకి శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఎన్నికల సంఘం ఈ విషయాన్ని ఖండించింది. అలాంటి విధానమే లేదని ఎన్నికల సంఘం చరకలు వేసింది. పవన్ కల్యాణ్ అధికారం ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఒకలా ప్రవర్తించలేదు.

వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు పవన్ కల్యాణ్…తన సొంత డబ్బులు రూ.5 కోట్లు ఖర్చు పెట్టి కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడ్డారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా 24 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.1 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశాం. వైఎస్ జగన్ ఎప్పుడైనా తన సొంత డబ్బు పైసా అయినా ఖర్చు చేశారా? ఎవరైనా ఆదుకున్నారా? “-మంత్రి నాదెండ్ల మనోహర్

“సూపర్ -6 హామీలపై ప్రశ్నించే అర్హత జగన్ కు ఉందా? అని ప్రశ్నిస్తున్నాం. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం తన సొంత మీడియాతో ఎంత తప్పుడు ప్రచారం చేశారో? అందరికీ తెలుసు. ఈ రోజుకు 94 లక్షల మందికి పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. ఎన్నికలకు ముందు ఒక మాట, ఇప్పుడొక మాట మాట్లాడడం సరికాదు. జగన్ వర్క్ ఫ్రమ్ హోం ఎమ్మెల్యే. ఆయన బెంగళూరు నుంచి పనిచేస్తున్నారు. శాసనసభకు రమ్మంటే పారిపోతున్నారు. మేము కూడా అనొచ్చు కదా. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలి పోటుకు తక్కువ అని. బాబాయి హత్య ఎలా జరిగిందో అందరికీ తెలుసు కదా!”- మంత్రి నాదెండ్ల మనోహర్

మంత్రి లోకేశ్ ఆగ్రహం

“గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి..ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడే ముందు, జగన్ ఒకసారి ఆలోచించుకోవాలి. జగన్ అహంకారంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా మాట్లాడటం బాధాకరం. సొంత తల్లి, చెల్లి, కార్యకర్తలు తనను ఎందుకు విశ్వసించటం లేదో జగన్ ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రంలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు బ్యాలెన్స్ చేసుకుంటూ, ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన చేస్తున్నాం. జగన్ బెంగుళూరులో ఉంటారు. ఆయనకు రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు తెలియవు. గత ప్రభుత్వంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి దూరమయ్యారు. ఎందుకో ఆయనే సమాధానం చెప్పాలి. ఇవన్నీ చర్చిద్దాం, అసెంబ్లీకి రండి.” –మంత్రి లోకేశ్

Bandaru Satyaprasad

TwittereMail

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsTrending ApTelugu NewsAp PoliticsYsrcpPawan KalyanYs Jagan
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024