Accident : హై స్పీడ్​లో గుద్దుకున్న వాహనాలు! స్పాట్​లో ఏడుగురు మృతి- మరో 14 మంది..

Best Web Hosting Provider In India 2024


Accident : హై స్పీడ్​లో గుద్దుకున్న వాహనాలు! స్పాట్​లో ఏడుగురు మృతి- మరో 14 మంది..

Sharath Chitturi HT Telugu
Published Mar 10, 2025 01:28 PM IST

MP road accident : మధ్యప్రదేశ్​లో ఎన్​హెచ్​ 31పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఎస్​యూవీ, ఓ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు స్పాట్​లో మరణించారు. మరొకరు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఆసుపత్రి వద్ద.. ప్రమాదానికి గురైన బాధితుల కుటుంబసభ్యులు
ఆసుపత్రి వద్ద.. ప్రమాదానికి గురైన బాధితుల కుటుంబసభ్యులు

మధ్యప్రదేశ్​లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. సిద్ధి జిల్లాలోని ఎన్​హెచ్​-39పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఎస్​యూవీ- ఒక లారీ హై స్పీడ్​లో గుద్దుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మరణించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించినట్టు తెలుస్తోంది. ఇదే ఘటనలో కనీసం 14మంది గాయపడ్డారు.

ఇదీ జరిగింది..

సిద్ధి జిల్లాలోని బహ్రీ గ్రామానికి చెందిన కొందరు.. ఒక ఎస్​యూవీ (తూఫాన్​)లో మైహర్​లోని శారదా ఆలయానికి బయలుదేరారు. ఎన్​హోచ్​-31పై వెళుతుండగా.. ఎదురుగా ఒక సిమెంట్​ లారీ వచ్చింది. రెండు వాహనాలు హై స్పీడ్​లో ఉండగా, ఒకదాన్ని ఒకటి ఢీకొట్టాయి. ఈ విషయాన్ని డీఎస్​పీ గాయత్రీ దేవి వెల్లడించారు.

సోమవారం తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు ఈ ఘటన జరిగంది.

కాగా ప్రమాదం సమయంలో రెండు వాహనాలు విపరీతమైన వేగంతో వెళుతున్నట్టు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన 14 మందిని సిద్ధి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా.. క్షతగాత్రుల్లో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని రేవా మెడికల్ కాలేజీకి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ఘటనపై పోలీసులు, రవాణా శాఖ దర్యాప్తు ప్రారంభించాయి. అయితే, ప్రమాదం సమయంలో ఎస్​యూవీ ఓవర్​లోడ్​లో ఉన్నట్టు తెలుస్తోంది.

లారీ డ్రైవర్​ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

మరోవైపు బాధిత కుటుంబాల ఆర్థనాథాలతో ఆసుపత్రి ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కుటుంబసభ్యుల మృతదేహాలను చూసి బంధువులు విలపించారు.

సీఎం దిగ్భ్రాంతి..

మధ్యప్రదేశ్​ రోడ్డు ప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం మోహన్​ యాదవ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 1, స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడిన వారికి రూ. 50వేలు పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు.

పంజాబ్​లో రోడ్డు ప్రమాదం..

పంజాబ్ జలంధర్ జిల్లాలో సోమవారం ఇటుకలతో నిండిన ట్రాక్టర్ ట్రాలీని ఓ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు.

బస్సు రాజస్థాన్ నుంచి జమ్ము వెళుతుండగా జలంధర్​లోని కాలా బక్రా ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

గ్రామంలో రోడ్డు నుంచి జలంధర్-పఠాన్ కోట్ హైవేపై ట్రాక్టర్ ట్రాలీ రాగానే బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ప్రయాణికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించారు.

క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు ఈ ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link