


Best Web Hosting Provider In India 2024

Jiohotstar Record: ఓటీటీలో అన్ని రికార్డులు బ్రేక్ చేసిన ఇండియా, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. 85 కోట్ల వ్యూస్
Jiohotstar Record: జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ అయిన ఇండియా, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అన్ని ఓటీటీ రికార్డులను తిరగరాసింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ రికార్డు వ్యూస్ కూడా ఇప్పుడు బ్రేక్ కావడం విశేషం.

Jiohotstar Record: ఓటీటీ స్ట్రీమింగ్ లో ఇప్పటి వరకూ ఉన్న రికార్డులను తిరగరాసింది ఇండియా, న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. ఏకంగా 85 కోట్ల వ్యూస్ నమోదు కావడం విశేషం. అంతేకాదు ఒకేసారి ఈ మ్యాచ్ ను లైవ్ లో 6.1 కోట్ల మంది చూడటం కూడా స్ట్రీమింగ్ లో సరికొత్త రికార్డు అని ఆ ఓటీటీ వెల్లడించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రికార్డు
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ ను టీమిండియా చిత్తు చేసి మూడోసారి ట్రోఫీ అందుకున్న క్షణాన్ని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. అలాగే ఈ మ్యాచ్ జియోహాట్స్టార్ లో క్రియేట్ చేసిన రికార్డులు కూడా ఇప్పట్లో మరేదీ తిరగరాయలేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ కు మొత్తంగా 85 కోట్ల వ్యూస్ నమోదయ్యాయి.
అయితే ఇవి యూనిక్ వ్యూస్ కావు. ఒకటి కంటే ఎక్కువసార్లు ఓ వ్యక్తి చూసిన వ్యూస్ కూడా ఇందులో నమోదవుతాయి. అలా చూసినా ఇప్పటి వరకూ ఏ క్రికెట్ మ్యాచ్ కూ సాధ్యం కాని రికార్డు ఇదే. ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు 60 కోట్ల వ్యూస్ వచ్చాయి. అలా చూసినా ఈ ఫైనల్ కు వచ్చిన వ్యూస్ చాలా చాలా ఎక్కువే.
ఒకేసారి 6 కోట్లకుపైగా..
జియోహాట్స్టార్ లో ఈ ఫైనల్ మ్యాచ్ ను ఒకేసారి లైవ్ లో 6.1 కోట్ల మంది చూశారట. వీటిని కాన్కరంట్ వ్యూయర్స్ అంటారు. అంటే ఒకే సమయంలో ఏకంగా 6.1 కోట్ల మంది చూడటం గతంలో ఎప్పుడూ నమోదు కాని రికార్డు అని జియోహాట్స్టార్ వెల్లడించింది.
స్పోర్ట్స్ స్ట్రీమింగ్ లో ఓ కొత్త బెంచ్ మార్క్ తాము సెట్ చేసినట్లు తమ లింక్డిన్ పోస్టులో ఆ ఓటీటీ తెలిపింది. 2023లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ఒకే సమయంలో 5.9 కోట్ల మంది చూశారు. ఇప్పుడా రికార్డు బ్రేకయింది.
ఇండియా బ్యాటింగ్, ట్విస్టుల సమయంలో..
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ కంటే ఇండియా బ్యాటింగ్ సమయంలోనే ఎక్కువ వ్యూస్ నమోదయ్యాయి. న్యూజిలాండ్ బ్యాటింగ్ పూర్తయ్యే సమయానికి 39 కోట్లకుపైగా వ్యూస్ నమోదైనట్లు జియోహాట్స్టార్ తెలిపింది.
తర్వాత ఇండియా చేజింగ్ మొదలవడం, రోహిత్, గిల్ మంచి స్టార్ట్ ఇవ్వడంతో ఇది పీక్ స్టేజ్ కు వెళ్లింది. ఇక చివర్లో ట్విస్టులు, ఇండియా వికెట్లు కోల్పోవడం, రాహుల్, హార్దిక్ సిక్స్ లు కొట్టిన తర్వాత వ్యూస్ మొత్తంగా 85 కోట్లకు చేరుకున్నాయి. మ్యాచ్ లోని ట్విస్టులతో ఈ నంబర్ తగ్గుతూ, పెరుగుతూ వెళ్లింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ ను మరో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్లతో టీమిండియా చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ టీమ్ మూడోసారి ఈ ట్రోఫీ గెలిచింది. 2002లో తొలిసారి శ్రీలంకతో సంయుక్త విజేతగా నిలవగా.. 2013లో మరోసారి ట్రోఫీ అందుకుంది.
సంబంధిత కథనం