





Best Web Hosting Provider In India 2024

Allu Arjun: ప్రశాంత్ నీల్తో అల్లు అర్జున్ సినిమా! క్రేజీ ప్రాజెక్ట్పై బజ్ ఇదే
Allu Arjun: అల్లు అర్జున్ లైనప్పై చాలా ఆసక్తి నెలకొని ఉంది. పుష్ప 2తో హిట్ భారీ హిట్ కొట్టిన బన్నీ నెక్స్ట్ చిత్రం ఏదో ఇంకా సస్పెన్స్ ఉంది. ఈ తరుణంలో మరో క్రేజీ రూమర్ బయటికి వచ్చింది.

పుష్ప 2: ది రూల్ మూవీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ బ్లాక్బస్టర్ కొట్టారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో అనేక రికార్డులను బద్దలుకొట్టింది. హిందీలోనూ కలెక్షన్ల ర్యాంపేజ్ చేసింది. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏదోననే ఆసక్తి నెలకొంది. డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, తమిళ దర్శకుడు అట్లీ చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మరో క్రేజీ ప్రాజెక్టు కోసం అల్లు అర్జున్ అర్జున్ చర్చలు జరుపుతున్నారని రూమర్లు బయటికి వచ్చాయి.
ప్రశాంత్ నీల్తో..
కేజీఎఫ్ 1, 2, సలార్ లాంటి హైవోల్టేజ్ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్తో ఓ మూవీని చేసేందుకు అల్లు అర్జున్ చర్చల్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మించనున్నారట. మూవీ చేసేందుకు దిల్రాజు వద్ద గతంలోనే అల్లు అర్జున్ అడ్వాన్స్ తీసుకున్నారని తెలిసింది. ఇటీవలే చిత్రం కోసం దిల్రాజుకు ఐకాన్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ బయటికి వచ్చింది. అయితే, ఏ దర్శకుడితో అనే విషయం మాత్రం అప్పటికి డిసైడ్ అవలేదు. ప్రశాంత్ నీల్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది.
ఇటీవలే మీటింగ్!
ఇటీవలే అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్కు ఓ మీటింగ్ ఏర్పాటు చేశారట దిల్రాజు. ప్రశాంత్ నీల్ తన స్టోరీ ఐడియాలను బన్నీకి చెప్పారట. ప్రశాంత్ నీల్ చెప్పిన ఓ ఇంటెన్స్ యాక్షన్ స్టోరీ లైన్ అల్లు అర్జున్కు నచ్చి.. పూర్తి నరేషన్ ఇవ్వాలి అడిగారని ఇండస్ట్రీ వర్గాల టాక్. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని చర్చలు జరగనున్నాయి. మొత్తంగా ప్రశాంత్ నీల్తో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ రూమర్లతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అట్లీతోనే నెక్స్ట్
అల్లు అర్జున్ తర్వాతి చిత్రం డైరెక్టర్ అట్లీతోనే ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకోసం మేకోవర్ కూడా బన్నీ మార్చేయనున్నారట. ఈ విషయాన్ని నిర్మాత బన్నీవాసు చెప్పారు. విదేశాలకు వెళ్లి ఈ చిత్రం కోసం ఫిజికల్ ట్రైనింగ్ను అల్లు అర్జున్ తీసుకుంటారని వెల్లడించారు. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అట్లీ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో చిత్రాన్ని అల్లు అర్జున్ చేయనున్నారు. ఈ మూవీ మైథాలజీ టచ్తో భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా ఉండనుందనే రూమర్లు ఉన్నాయి. అట్లీతో మూవీని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మొదలుపెట్టాలనేది బన్నీ ప్లాన్ అని తెలుస్తోంది. ఒకవేళ ప్రశాంత్ నీల్తో మూవీ ఓకే అయితే.. త్రివిక్రమ్ తర్వాతి ప్రాజెక్టుగా ఉంటుంది.
సంబంధిత కథనం