వెంటనే అమెరికాను విడిచి వెళ్లండి.. లేదంటే రోజుకు రూ.86 వేల జరిమానా కట్టాలి

Best Web Hosting Provider In India 2024


వెంటనే అమెరికాను విడిచి వెళ్లండి.. లేదంటే రోజుకు రూ.86 వేల జరిమానా కట్టాలి

Anand Sai HT Telugu Published Apr 09, 2025 06:15 AM IST
Anand Sai HT Telugu
Published Apr 09, 2025 06:15 AM IST

Migrants In US : ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది. దేశాన్ని వీడకుంటే భారీగా జరిమానా విధించేందుకు యోచిస్తోంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.

డొనాల్డ్ ట్రంప్
డొనాల్డ్ ట్రంప్

అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం యావత్ ప్రపంచం చూసింది. వేలాది మంది అక్రమ వలసదారులను సైనిక విమానాల ద్వారా బహిష్కరించిన అధ్యక్షుడు ట్రంప్.. మిగిలిన వలసదారులను కూడా వదిలిపెట్టడం లేదు. ఎందుకంటే తక్షణమే దేశం విడిచిపోవాలని అమెరికా వారికి చెబుతోంది. లేదంటే భారీగా జరిమానా ఉంటుందని అంటోంది.

భారీగా జరిమానా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికా ఫస్ట్ విధానాన్ని అనుసరిస్తూ అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం వేలాది మంది వలసదారులను సైనిక విమానాల ద్వారా బహిష్కరించడమే కాకుండా, దేశంలో వారిని నిశితంగా పరిశీలిస్తోంది. వలసదారుల గురించి ట్రంప్ త్వరలోనే మరో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం బహిష్కరణ ఆదేశాలు ఉన్నప్పటికీ అమెరికాను విడిచిపెట్టని వ్యక్తులపై జరిమానాలు విధించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

86 వేల ఫైన్

సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ ద్వారా నమోదు చేసుకొని వెళ్లిపోవాలని సూచిస్తోంది. స్వీయ బహిష్కరణ సరైన మార్గమని లేదంటే.. ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి ట్రిసియా చెప్పారు. బహిష్కరణ ఉత్తర్వుల కింద వలసదారులకు రోజుకు 998 డాలర్ల(రూ.86 వేల పైనే) వరకు జరిమానా విధించాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. దీని ప్రకారం నిర్దేశిత గడువులోగా వలసదారుడు అమెరికాను విడిచి వెళ్లకపోతే వారి ఆస్తులను కూడా జప్తు చేస్తారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ట్రంప్ 1996 చట్టాన్ని ఆశ్రయించవచ్చని నివేదిక పేర్కొంది.

భవిష్యత్తులోనూ సమస్య

ఈ ప్రణాళికలపై చర్చించడానికి పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ ట్రంప్ అధికారి మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వం ఐదేళ్ల వరకు జరిమానాలు విధించవచ్చని చెప్పారు. సెల్ఫ్ డిపోర్ట్ యాప్‌లో నమోదు చేసుకున్న తర్వాత వెళ్లకపోతే వెయ్యి నుంచి ఐదు వేల డాలర్ల వరకు జరిమానా ఉండనుంది. భవిష్యత్తులో అమెరికాకు వచ్చే అవకాశం కూడా కోల్పోతారు.. జైలు శిక్ష కూడా ఉండనుంది.

దీనిపై అమెరికా ట్రిసియా స్పందిస్తూ అక్రమ వలసదారులు స్వీయ బహిష్కరణకు, దేశం విడిచి వెళ్లడానికి మొబైల్ యాప్‌ను ఉపయోగించాలని సూచించారు. అలా చేయకపోతే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రోజుకు 998 డాలర్ల జరిమానా చెల్లించాలి. అక్రమవలసదారులపై జరిమానా విధిస్తామని మార్చి 31న సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ.

Anand Sai

eMail

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link