Best Web Hosting Provider In India 2024
Rythu Nestham in Telangana: తెలంగాణలో కొత్తగా ‘రైతు నేస్తం’(Telangana Rythu Nestham) కార్యక్రమం అమల్లోకి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా రైతు నేస్తం కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.
ట్రెండింగ్ వార్తలు
దశలవారీగా 3 సంవత్సరాల్లో 2,601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను స్థాపిస్తారు. రూ.97 కోట్ల తో ప్రాజెక్టు అమలు కానుంది. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు కానుండగా… ఇందుకోసం ప్రభుత్వం . రూ. 4.07 కోట్లను విడుదల చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఈ డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ వ్యవస్థను సర్కార్ ప్రవేశపెట్టింది.
వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు ఉంటాయి. గ్రామాల నుంచే రైతులు ఆన్ లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవటం. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవటం వంటివి జరుగుతాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టింది.
టాపిక్