Best Web Hosting Provider In India 2024

విశాఖపట్నం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమనివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలో విశాఖపట్నంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ను పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ ఇరవై రోజులు పార్టీ నాయకులు అయా నియోజకవర్గాల్లో ఓటర్లను కలిసి మెజార్టీ సాధించే దిశలో పని చేయాలి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల కోసం ఈరోజు నుంచి విశాఖలో వైయస్ఆర్ సీపీ ప్రత్యేక కార్యాలయం అందుబాటులో ఉంటుంది.