గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయం

Best Web Hosting Provider In India 2024

విశాఖపట్నం: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌  పార్టీ అభ్య‌ర్థుల విజయం ఖాయమ‌నివైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. 
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి సారథ్యంలో విశాఖపట్నంలో సమావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు.  సమావేశం అనంతరం మీడియాతో వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు ధర్మాన ప్రసాదరావు,  బొత్స సత్యనారాయణ మాట్లాడారు.  వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..   ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్‌ను పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ ఇరవై రోజులు పార్టీ నాయకులు అయా నియోజకవర్గాల్లో ఓటర్లను కలిసి మెజార్టీ సాధించే దిశలో పని చేయాలి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల కోసం ఈరోజు నుంచి విశాఖలో వైయస్ఆర్‌ సీపీ ప్రత్యేక కార్యాలయం అందుబాటులో ఉంటుంది.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *