ఏపీ సీడ్స్‌కు జాతీయ‌స్థాయిలో మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

Best Web Hosting Provider In India 2024

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్‌) కు జాతీయ స్ధాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. వరుసగా రెండోసారి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం, మూడున్నరేళ్ళుగా ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీలో విశేష కృషి ఫలితం. ఏపీ సీడ్స్‌ గవర్నెన్స్‌ నౌ అవార్డు గెలుచుకోవడంపై అధికారులను  సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి మంగ‌ళ‌వారం క్యాంపు కార్యాల‌యంలో అభినందించారు. 
అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్ధలకు గవర్నెన్స్‌ నౌ అంతర్జాతీయ సంస్ధ తొమ్మిదేళ్ళుగా ఈ అవార్డులను ప్రధానం చేస్తోంది. ఈ ఏడాది పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్‌ (పీఎస్‌యూ–ప్రభుత్వరంగ సంస్ధలు) యూనిట్స్‌ కేటగిరిలో ఏపీ సీడ్స్‌కు రెండోసారి గవర్నెన్స్‌ నౌ అవార్డును ప్రకటించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయస్ధాయి సమావేశంలో సుప్రింకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా చేతుల మీదుగా ఏపీ సీడ్స్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, చైర్‌పర్సన్‌ పేర్నాటి సుశ్మిత ఈ అవార్డును అందుకున్నారు. 

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *