Minor’s rape in Ayodhya: అయోధ్యలో మైనర్ పై సామూహిక అత్యాచారం: సీఎం యోగి ‘బుల్డోజర్’ న్యాయం

Best Web Hosting Provider In India 2024


అయోధ్య జిల్లాకు చెందిన 12 ఏళ్ల అత్యాచార బాధితురాలి తల్లికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. లక్నోలోని ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసిన బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడుతూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

రెండు నెలలుగా అత్యాచారం..

తన బేకరీలో పని చేస్తున్న 12 ఏళ్ల దినసరి కూలీపై రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడిన బేకరీ యజమాని, అతని ఉద్యోగిని అయోధ్య పోలీసులు అరెస్టు చేశారు. వారి లైంగిక దాడి కారణంగా బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటన అయోధ్య జిల్లా పురకలందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భదర్సా పట్టణంలో చోటుచేసుకుంది. పురకలందర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రతన్ శర్మ, భదర్సా పోలీస్ ఔట్ పోస్ట్ ఇన్ చార్జి అఖిలేష్ గుప్తాలను అయోధ్య పోలీసు యంత్రాంగం సస్పెండ్ చేసింది. ప్రధాన నిందితుడు మొయిద్ ఖాన్ సమాజ్ వాదీ పార్టీ కార్యకర్త అని, మిగతా నిందితుడిని రాజుఖాన్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు.

మరణశిక్ష విధించాలి

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన అనంతరం తల్లి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని నమ్ముతున్నామన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదిలిపెట్టరని, కఠిన శిక్ష విధిస్తారని విశ్వసిస్తున్నానన్నారు. నిందితులకు మరణశిక్ష విధించాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేసింది. అన్ని విధాలా న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

అక్రమాస్తుల కూల్చివేత

నిందితుడైన సమాజ్ వాదీ పార్టీ నేత మొయిద్ ఖాన్ ఆస్తులపై విచారణ జరిపిస్తామని, అక్రమాస్తులను కూల్చివేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. బికాపూర్ బీజేపీ ఎమ్మెల్యే అమిత్ సింగ్ చౌహాన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వీడియో రికార్డింగ్

అయోధ్య ఎస్ఎస్పీ రాజ్ కరణ్ నయ్యర్ మాట్లాడుతూ మైనర్ పై జరిగిన లైంగిక దాడిని నిందితుడు వీడియోలో రికార్డ్ చేశాడని చెప్పారు. రెండున్నర నెలలుగా ఖాన్ తనపై లైంగిక వేధింపులు కొనసాగించాడని, ఆ వీడియోను ఉపయోగించి తనను బెదిరించాడని బాధితురాలు తెలిపింది. తన ఉద్యోగి రాజు సహాయంతో ఖాన్ ఈ చర్యలకు పాల్పడ్డాడని ఎస్ఎస్పీ తెలిపారు. మైనర్ గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

బుల్డోజర్ న్యాయం

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి రెండేళ్ల క్రితం చనిపోయాడని నయ్యర్ తెలిపారు. కాగా, ప్రధాన నిందితుడి బేకరీని శనివారం అధికారులు కూల్చివేశారు. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి భారీ పోలీసు నిఘాలో ‘బుల్డోజర్ యాక్షన్’ చేపట్టారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024



Source link