YS Jagan in Nandyal : చంద్రబాబు, లోకేశ్ పై కేసులు పెట్టాలి.. లేకపోతే లా అండ్ అర్డర్ ఉండదు – వైఎస్ జగన్

Best Web Hosting Provider In India 2024


నంద్యాల జిల్లాలోని సీతారామపురంలో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన…కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని… మారణహోమం సృష్టించే పాలన చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పాలన అమలు చేస్తున్నారన్నారు. పూర్తిగా లా అండ్‌ ఆర్డర్‌ నాశనం చేస్తున్నారని… పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తున్నారంటే.. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కామెంట్స్ చేశారు.

ఎస్ఐ సమక్షంలోనే సుబ్బారాయుడిని హత్య చేశారు. దీనిలో రాజకీయ కుట్ర లేకపోతే హత్య జరిగిన తర్వాత కూడా గ్రామానికి అడిషనల్‌ ఫోర్స్ ఎందుకు రాలేదు? హత్య చేసిన వారిని ఎందుకు పట్టుకోలేదు? ప్రతి ఊరిలో ఇద్దరు వైయస్ఆర్ సీపీ నాయకులను చంపండి అని శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మీటింగ్ లు పెట్టి మరీ చెబుతున్నాడు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బతకాలంటే చంపిన వాళ్ల మీదనే కాకుండా రెచ్చగొడుతున్న ఎమ్మెల్యేల మీద వారికి సపోర్ట్ చేస్తున్న చంద్రబాబు, నారా లోకేశ్ ను కూడా కేసుల్లో ముద్దాయిలుగా చేర్చాలి” అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.

టాపిక్

Ys JaganAndhra Pradesh NewsNara LokeshChandrababu Naidu

Source / Credits

Best Web Hosting Provider In India 2024