Best Web Hosting Provider In India 2024
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్, డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో కన్వినర్ కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ శుక్రవారం ప్రకటనను జారీ చేసింది. కన్వీనర్ కోటా సీట్లతోపాటు తిరుపతి శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన సీట్లను భర్తీ చేయనున్నారు.
నీట్ లో అర్హత సాధించిన విద్యార్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఆగస్టు 16వ తేదీని తుది గడువుగా పేర్కొన్నారు. https://drntr.uhsap.in/index/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 43,788 మంది నీట్ యూజీ–2024లో అర్హత సాధించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 89787 80501, 79977 10168 నంబర్లను సంప్రదించవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
టాపిక్