Vijayawada : విజయవాడలో ఆయుర్వేద కాలేజీ వైద్య విద్యార్థులు నిరసన, సస్పెండ్ చేస్తానని ప్రిన్సిపల్ బెదిరింపులు!

Best Web Hosting Provider In India 2024


Vijayawada : కోల్ కతాలో వైద్యురాలిపై హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేస్తున్నారు. శనివారం దేశ వ్యాప్తంగా ఓపీ సేవలు నిలిచిపోయాయి. వైద్యులపై పెరుగుతున్న దాడులకు నిరసనగా ఐఎంఏ పిలుపు మేరకు వైద్యులు 24 గంటలు పాటు వైద్య సేవలు నిలిపివేశారు. అత్యవసర, క్యాజువాలిటీ వైద్య సేవలు మాత్రమే అందిస్తున్నారు. ఏపీలో కూడా వైద్యులు ఓపీ సేవలు నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో వైద్య విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. విశాఖలో వైద్య విద్యార్థుల నిరసనకు హోంమంత్రి వంగలపూడి అనిత మద్దతు తెలిపారు.

వైద్య విద్యార్థుల నిరసనపై ప్రిన్సిపల్ సీరియస్

విజయవాడ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల వద్ద వైద్య విద్యార్థుల ఆందోళన చేపట్టారు. కోల్ కతా వైద్యరాలిపై అత్యాచార ఘటనపై వైద్య విద్యార్థుల నిరసన తెలిపారు. మహాత్మాగాంధీ రోడ్డులో నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులపై ప్రిన్సిపల్ సాయి సుధాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా నిరసనకు దిగిన విద్యార్థులపై చర్యలు తీసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డారు. ధర్నాను చిత్రీకరిస్తున్న మీడియాపై ప్రిన్సిపల్ సీరియస్ అయ్యారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు, ప్రిన్సిపల్ అనుమతి తీసుకుని నిరసన చేయాలన్నారు. తన అనుమతి లేకుండా రోడ్లపైకి వస్తే సస్పెండ్ వంటి తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రిన్సిపల్ వైఖరిపై విద్యార్థుల ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వైద్యురాలికి అన్యాయం జరిగిందని నిరసన తెలిపితే తప్పేముందని ప్రశ్నించారు.

సంబంధిత కథనం

టాపిక్

VijayawadaAndhra Pradesh NewsTrending ApTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024