Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: వైయస్ అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డిపై కేసులు నిలబడవని, ఎందుకంటే వాళ్ల ఏ తప్పు చేయలేదని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కొంత కాలం ఇబ్బంది పెడతారేమో కానీ చివరకు న్యాయమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ జరుగుతున్న తీరుపై సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. యథేచ్చగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అందులో భాగంగానే నిందితుడు దస్తగిరి మాటలను పతాక శీర్షికలో ప్రచురించారని పేర్కొన్నారు. విపక్షాల పొలిటికల్ ఎజెండాలో భాగంగానే అవినాష్రెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల్లో పని చేస్తుందని టీడీపీ దురాశ అన్నారు. కొంత కాలం ఇబ్బంది పెడతారేమో కానీ చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు.