Best Web Hosting Provider In India 2024
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రతి ఊళ్లోనూ సందడి నెలకొంది. మళ్లీ రాష్ట్రానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది.
సీఎం వైయస్ జగన్ ప్రతినిధులుగా వచ్చిన ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లకు ప్రజలు చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నారు. పలు చోట్ల ఎదురువెళ్లి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల వద్దకే ఎమ్మెల్యే రావడం అంటే అది కేవలం ఒక్క సీఎం జగనన్న వల్లే సాధ్యమైందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.