Best Web Hosting Provider In India 2024
తాడేపల్లి: సామూహిక ప్రార్థనలతో ధార్మిక చింతన, ఐకమత్యం.. రంజాన్ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్. జగన్ శుభాకాంక్షలు (ఈద్ ముబారక్) తెలిపారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.
మానవాళికి హితాన్ని బోధించే రంజాన్ పండుగ… సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని ముఖ్యమంత్రి అన్నారు.