Best Web Hosting Provider In India 2024
ఈ నెల 18న ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ప్రకటన జారీ అయింది. సచివాలయంలోని ఒకటో నెంబర్ బ్లాక్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఇటీవలే కురిసిన వర్షాలు, వరద నష్టం, బుడమేరు పటిష్టతపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వరద బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి అన్నదానిపై కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.
టాపిక్
Ap CabinetAndhra Pradesh NewsChandrababu Naidu