చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28న ఆల‌యాల్లో పూజ‌లు 

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ పిలుపు

తాడేప‌ల్లి:  తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకు, ఆయ‌న పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ పిలుపునిచ్చింది. ఈ మేర‌కు పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు

 తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారంరోజున పూజల్లో పాల్గొనాలని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిస్తూ ట్వీట్ చేశారు.

Best Web Hosting Provider In India 2024