జీవో నంబర్ 56 వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తాం

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ వైయ‌స్ఆర్‌ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి
 

వైయ‌స్ఆర్ జిల్లా : ప్రభుత్వం జీవో నంబర్ 56 వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ వైయ‌స్ఆర్‌ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కడప, రాయలసీమపై కక్ష సాధింపునకు దిగుతున్నారు. దానికి కొప్పర్తి సేజ్‌కి వచ్చిన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపే నిదర్శనం’’ అని అన్నారు.  వైయ‌స్ఆర్‌ జిల్లాలోని కొప్పర్తి సేజ్‌కు కేటాయించిన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ తరలింపుపై గురువారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఆయన మాట్లాడారు. 

కేంద్రం కేటాయించిన టెక్నాలజీ సెంటర్‌ను మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం ఆంజాద్ బాషా నిలదీశారు. రాయలసీమకు వచ్చిన ప్రతి ఒక్క సంస్థను తీసుకెళ్ళిపోతున్నారు. పులివెందుల మెడికల్ సీట్లు వెనక్కి పంపారు. రాయలసీమ వాడిని అని చెప్పుకునే చంద్రబాబు.. ఇలాంటి చర్యలకు పాల్పడటం దౌర్భాగ్యం. రాజకీయాలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు.    

Best Web Hosting Provider In India 2024