Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: జనశ్రేయస్సే లక్ష్యంగా.. ప్రతి కుటుంబ సంతోషమే ధ్యేయంగా.. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే అంకితభావం కలిగిన ప్రజానాయకుడు ముఖ్యమంత్రిగా పరిపాలన పగ్గాలు చేపట్టి రేపటితో నాలుగేళ్లు పూర్తి. నవ్యాంధ్ర ప్రదేశ్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు రేపటితో నాలుగు సంవత్సరాలు నిండుతున్నాయి. వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన కొనసాగుతున్న సుపరిపాలన 2023 మే 30న ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ నాలుగేళ్లలో దాదాపు ఐదున్నర కోట్ల ఏపీ ప్రజలు గతంలో అంటే–1953 అక్టోబర్ 1–1956 అక్టోబర్ 31 మధ్యన (నాటి ఆంధ్ర రాష్ట్రంలో) గాని లేదా 1956 నవంబర్ 1–2014 జూన్ 1 మధ్యన (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో) గాని కనిపించని ప్రభుత్వ జన సంక్షేమ పథకాలను, సర్వోతోముఖ ప్రగతిని స్వయంగా చూశారు.