Best Web Hosting Provider In India 2024
ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు నమోదు కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న ఆయా నియోజకవర్గాలకు చెందిన అర్హత కలిగిన ఓటర్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రాడ్యూయేట్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి…?
- గ్రాడ్యూయేట్ ఓటు నమోదు కోసం ఫారమ్ 18 ద్వారా ఓటరు నమోదు దరఖాస్తును పూర్తి చేయాలి.
- గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఓటు కోసం ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆన్ లైన్ లో చేసుకోవాలనుకునే వారు ముందుగా https://ceotelangana.nic.in/home.html సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే MLC Graduates – Teacher ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. 1) Graduates’ – 2024 2) Teachers’ – 2024 కనిపిస్తాయి. 3) Form-18 (Graduates’) “Apply Online” “Download Offline Form” అనే ఆప్షన్ ఉంది. అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ముందుగా మీ Graduate Constituencyని ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- అడ్రస్, ఆధార్, విద్యార్హతలను ఎంట్రీ చేయాలి. డిగ్రీ సర్టిఫికెట్, ఫొటోను అప్ లోడ్ చేాయాలి.
- చివర్లో మీ మొబైల్ నెంబర్, మెయిల్ అడ్రస్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
- ఫైనల్ గా సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
- ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ సాయంతో మీ అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.
ఇక టీచర్ల కూడా పైన పేర్కొన్న విధంగా చేయాల్సి ఉంటుంది. కానీ వారు Form-19 ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలతో పాటు టీచర్ గా పని చేసిన ప్రాంతాల వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫొటో కూడా అప్ లోడ్ చేయాలి. చివర్లో సబ్మిట్ బటన్ పై నొక్కితే ప్రాసెస్ పూర్తి అవుతుంది.
రిజిస్ట్రేషన్ లింక్స్ :
- గ్రాడ్యూయేషన్ ఓటర్ నమోదు కోసం లింక్ – https://ceotserms2.telangana.gov.in/mlc/form18.aspx
- టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కోసం లింక్ – https://ceotserms2.telangana.gov.in/mlc/form19.aspx
పైన పేర్కొన్న నాలుగు జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల కాలపరిమితి 2025 మార్చి 29 నాటితో ముగియనుంది. ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఎలక్షన్ కమిషన్ అర్హత కలిగిన ఓటర్లకు పేర్ల నమోదు కోసం అవకాశం కల్పించింది. అక్టోబర్ 16, 25వ తేదీలలో రెండు పర్యాయాలు పత్రికాముఖంగా కూడా ప్రకటనలు జారీ చేస్తారు. 2024 నవంబర్ 06 వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ (ఏఈఆర్ఓ) కార్యాలయాల్లో నేరుగా కూడా ఓటర్లు దరఖాస్తులు సమర్పించవచ్చు. గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు సైతం మరోసారి తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
గడువులోపు దాఖలైన దరఖాస్తులను పరిశీలించిన మీదట నవంబర్ 23 న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుంది. ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నవంబర్ 23 నుండి డిసెంబర్ 09 వ తేదీ వరకు తెలియజేయాలి. 2024 డిసెంబర్ 30 న నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలతో కూడిన గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను వెలువరిస్తారు.
టాపిక్