Baba Siddique : సల్మాన్​- షారుఖ్​ మధ్య ‘కోల్డ్​ వార్​’ని అంతం చేసిన బాబా సిద్ధిఖీ- ఎలా అంటే..

Best Web Hosting Provider In India 2024


మహారాష్ట్ర ప్రముఖ రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబై బాంద్రాలోని ఆయన కుమారుడు జీషాన్ కార్యాలయంలో శనివారం రాత్రి ముగ్గురు దుండగులు బాబా సిద్దిఖీని కాల్చి చంపారు. ఆయన శరీరంలోకి ఆరు బుల్లెట్​లు చొచ్చుకెళ్లాయి. తీవ్ర గాయాలతో ఉన్న బాబా సిద్దిఖీని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మరణించరు. ఆయన వయస్సు 66. ఈ బాబా సిద్ధిఖీ ఒక రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే మాత్రమే కాదు బాలీవుడ్​లో ‘మధ్యవర్తిగా’ మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా సల్మాన్​ ఖాన్​, షారుఖ్​ ఖాన్​ల మధ్య నెలకొన్న ‘కోల్డ్​ వార్​’ని బాబా సిద్ధిఖీ అంతం చేసిన విధానం గురించి ఇప్పటికీ చాలా మంది మాట్లాడుకుంటారు!

సల్మాన్​- షారుఖ్​ని కలిపిన బాబా సిద్దిఖీ..

అది 2013 సంవత్సరం. హిందీ చిత్రసీమలో ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ కోల్డ్ వార్ మధ్యలో ఉన్నారు. ఒకప్పుడు సల్మాన్ గర్ల్ ఫ్రెండ్​ కత్రినా కైఫ్ బర్త్ డే సందర్భంగా వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం. బాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయి ఇద్దరు బడా స్టార్ల మధ్య ఈ పవర్ ఫైట్ గురించి నిర్మాతలు ఆందోళన చెందడం మొదలుపెట్టారు.

బాబా సిద్ధిఖీకి ఈ విషయం తెలిసింది. ఆయన మద్దతు కావాలని కొందరు సినీ ప్రముఖులు కోరారు. సినిమాకి పెద్దగా సంబంధం లేని ఈ వ్యక్తి, కోల్డ్​ వార్​ని ముగించడమే కాకుండా, ఇద్దరు ఖాన్​లను మళ్లీ ఇండస్ట్రీలోనే బెస్ట్​ ఫ్రెండ్స్​గా మారే విధంగా చేశారు!

షారూఖ్- సల్మాన్​లను ఇలా కలిపారు..

బాబా సిద్ధిఖీ బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రోజులవి. ప్రతి ఈద్​కు ఆయన ఇచ్చే ఇఫ్తార్ విందులు దక్షిణ ముంబై సోషల్ సర్కిల్​లో హైలైట్​గా నిలిచేవి. సల్మాన్, షారుఖ్​ల మధ్య మధ్యవర్తిత్వం వహించాలని సిద్ధిఖీని ఇండస్ట్రీ వర్గాలు కోరాయని, సమస్యను పరిష్కరించేందుకు రాజకీయ నాయకుడు ఒక ఐడియాని కనుగొన్నారని అంటూ ఉంటారు. ఈ పార్టీలో సల్మాన్ తండ్రి, ప్రముఖ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్ పక్కన షారుఖ్​ను కూర్చోబెట్టారు.

సల్మాన్ టేబుల్ దగ్గరికి వచ్చే ముందు షారుఖ్ సలీం ఖాన్​తో కాసేపు మాట్లాడిన వీడియో వైరల్​గా మారింది. షారుఖ్ లేచిన తర్వాత ఇద్దరు స్టార్స్​ ఒకరినొకరు కౌగిలించుకుని పలకరించుకున్నారు. అప్పుడు బాబా సిద్ధిఖీ వారితో చేరి ఫోటోగ్రాఫర్లను క్లిక్ చేయమని అడుగారు. అలాగే, ఈద్ సందర్భంగా, కొన్ని మంచి పాత కుటుంబ బంధాన్ని ఉపయోగించి సిద్ధిఖీ ఈ స్టార్స్​ మధ్య కోల్డ్​ వార్​ని ఆపేశారు.

బాబా సిద్ధిఖీ ఎవరు?

ఈ ఏడాది మార్చ్​లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్​ పవార్​)లో చేరే వరకు 48 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాబా సిద్ధిఖీ.. 2013 వరకు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

శనివారం, విజయ దశమి రోజున తన కుమారుడు జీషాన్ కార్యాలయం దగ్గర బాణసంచా పేల్చుతుండగా బాబా సిద్ధిఖీపై దాడి జరిగింది. మీడియా కథనాల ప్రకారం రాత్రి 9.15 నుంచి 9.20 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link