Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నది ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ధృడ సంకల్పం. ఈ లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ఇవాళ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు. ఆటోల నిర్వాహణపై డ్రైవర్లను, అధికారులను అడిగి సీఎం వైయస్ జగన్ వివరాలు తెలుసుకున్నారు.