Hyd Murders: తల్లిని దక్కించుకోవాలని కుమార్తెను కడతేర్చాడు..వీడిన సూరారం బాలిక మర్డర్ మిస్టరీ

Best Web Hosting Provider In India 2024

Hyd Murders: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన బాలిక మిస్సింగ్ మిస్టరీ వీడింది. వారి కుటుంబంతో పరిచయం ఉన్న వ్యక్తే బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు గుర్తించారు. బాలిక తల్లిని దక్కించుకోడానికి ఏకంగా మూడు హత్యలకు నిందితుడు ప్లాన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

సూరారంలో బాలిక అదృశ్యం ఘటనలో నిందితుడిని పోలీసులు గుర్తించారు. బాలిక కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తే దారుణంగా చంపేశాడు. ఆమె సోదరిని కూడా హత్య చేసే ప్రయత్నాల్లో ఉండగా పోలీసులకు దొరికిపోయాడు. సూరారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఏడేళ్ల బాలిక కిడ్నాప్, హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.

ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం పాటగూడ గ్రామానికి చెందిన మిశ్రమ్‌ ప్రభాకర్‌ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం ఏడు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. అతను భర్త చనిపోయి ఇద్దరు కుమార్తెలున్న మహిళతో కలిసి సూరారం పరిధిలోని జీవన్‌ జ్యోతినగర్‌లో నివాసం ఉంటున్నాడు.

ప్రభాకర్‌కు మరో మిత్రుడి ద్వారా కూలీ పనులు చేసుకునే దయానంద్‌నగర్‌కు చెందిన తిరుపతి(31)తో పరిచయం ఏర్పడింది. తరచూ ప్రభాకర్‌ ఇంటికెళ్లే తిరుపతి ఆ మహిళపై కన్నేశాడు. ప్రభాకర్‌ ఇంట్లో తరచూ ఇద్దరూ మద్యం తాగేవారు. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని తిరుపతి భావించాడని పోలీసులు తెలిపారు. ప్రభాకర్‌తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలను అడ్డు తొలగించుకుంటే ఆ మహిళ ఒంటరిది అవుతుందని, తనకు దక్కుతుందనే ఉద్దేశంతో ముగ్గురిని చంపేయాలని భావించాడు.

ఈ క్రమంలో ఈ నెల 12న ఉదయం జ్యోత్స్నను నిందితుడు ద్విచక్ర వాహనంలో తన ఇంటికి తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి తీసుకొచ్చి వదిలేశాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ప్రభాకర్‌ ఇంటి వద్ద ఎవరూ లేని సమయం చూసి బాలికను మళ్లీ తనతో తీసుకెళ్లాడు. పొద్దుపోయే వరకూ ద్విచక్రవాహనంపై తిప్పుతూ..చీకటిపడ్డాక మేడ్చల్‌ పోలిస్‌స్టేషన్‌ పరిధి బాసరేగడి గ్రామం దగ్గర కత్తితో పొడిచి చంపేశాడు. ధూలపల్లి మీదుగా మేడ్చల్‌ సమీపంలోని బాస రేగడి గ్రామంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి వెంట తెచ్చుకున్న కత్తితో బాలిక గొంతు కోశాడని పోలీసులు వివరించారు.

అదే రోజు వెనక్కి వచ్చి ఇంటి దగ్గర ఉన్న చిన్న కుమార్తెను కూడా తీసుకెళ్లాలని నిందితుడు తిరుపతి ప్రణాళిక వేసుకున్నాడు. బాలిక అదృశ్యంపై అదే రోజు ఫిర్యాదు అందడం, కాలనీలో పోలీసు బృందాలు గాలింపు చేపట్టడంతో తిరుపతి పరారయ్యాడు. సీసీ కెమెరా ఫుటేజీలో నిందితుడు బాలికను తనతో తీసుకెళుతున్న దృశ్యాలను గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

దంపతుల దారుణ హత్య…

వ్యవసాయ క్షేత్రంలో కాపలాదారులుగా పని చేస్తున్న వృద్ధ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు ఠాణా పరిధి కొత్తగూడలో మంగళవారం రాత్రి జరగిన ఘటన బుధవారం ఉదయం వెలుగు చూసింది.

నాగర్‌ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన మూగ ఉషయ్య (70), అతడి భార్య శాంతమ్మ (60) కొత్తగూడ సమీపంలో తమ స్వగ్రామానికి చెందిన మనోహర్రావు వ్యవసాయ క్షేత్రంలో రెండున్నరేళ్లుగా కాపలా పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. వీరిని మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. శాంతమ్మను ఇంట్లోనే మంచంపై గొంతు కోసి హత్య చేశారు. ఉషయ్యను ఇంటికి వంద మీటర్ల దూరంలో మామిడి తోటలో పరిగెత్తించి, నరికి చంపారు. ఉదయం తోట యజమాని ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో ఆయన ట్రాక్టర్‌ డ్రైవర్‌ను పంపడంతో విషయం వెలుగు చూసింది.

Whats_app_banner

టాపిక్

Crime NewsCrime TelanganaHyderabadTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024