Nizamabad Crime : నిజామాబాద్ లో దారుణం, ఆటోలో తీసుకెళ్లి మహిళపై సామూహిత అత్యాచారం

Best Web Hosting Provider In India 2024

తెలంగాణలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ లో ఓ మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆటోలో మహిళ ఎక్కించుకుని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం బాధితురాలు పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది.

నిజామాబాద్ బస్టాండ్ లో శుక్రవారం రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు ఆటోలో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకువెళ్లి, ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వద్ద నుంచి తప్పించుకున్న మహిళ నిజామాబాద్ చేరుకుంది. శనివారం ఉదయం నగరంలోని ఒకటో పోలీసుస్టేషన్‌లో జరిగిన దారుణంపై ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు…దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులు డిచ్‌పల్లికి చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో

పోలీసులు బాధిత మహిళను ఘటనాస్థలికి తీసుకువెళ్లి పరిశీలించారు. నిజామాబాద్ బస్టాండ్‌ వద్ద ఆటోకు సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో అత్యాచార ఘటనలు ఎక్కువయ్యాయి. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనం అయ్యింది. ఈ కేసులో ముగ్గురు మైనర్లు సైతం ఉన్నారు. నిందితులను పోలీసులు 48 గంటల్లో అరెస్టు చేశారు. హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆటోవాలా అత్యాచారం చేశారు. ఈ ఘటన ఇటీవల తెలంగాణలో సంచలనం అయ్యింది.

గంజాయి, మద్యం మత్తులో రాత్రుళ్లు ఒంటరిగా ఉన్న మహిళలు లక్ష్యంగా దారుణాలు జరుగుతున్నట్లు పోలీసుల సైతం నిర్థారిస్తున్నారు. పోలీసులు ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా…మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదని, కఠినమైన చట్టాలతో ఈ దురాగతాలకు అడ్డుకట్టవేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారం

హైదరాబాద్ లో ఇటీవల దారుణం చోటుచేసుకుంది. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై ఆటోలో ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 14న అర్ధరాత్రి గచ్చిబౌలి ప్రాంతంలోని ఆర్సీపురంలో ఓ ఐటీ ఉద్యోగిని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఆటో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. మసీద్ బండలోని నిర్మానుష ప్రాంతానికి ఆటోను తీసుకెళ్లి… ఆటో డ్రైవర్ తో పాటు, మరో యువకుడు యువతిపై ఆటోలోనే అత్యాచారం చేశారు.

ఈ ఘటన అనంతరం ఆమెను మసీద్ బండ వద్దే వదిలేసి పరారయ్యారు. బాధిత యువతి తనపై జరిగిన అఘాయిత్యం గురించి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో ఉద్యోగాల నుంచి వచ్చే మహిళలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానంగా ఉండే వెంటనే డయల్ 100ను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Crime TelanganaNizamabadTelangana NewsTrending TelanganaTelugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024